యాప్నగరం

GHMC: నగరంలో మరో దుర్ఘటన.. నాలాలో పడి వ్యక్తి మృతి.. నిర్లక్ష్యమే.!

సాహెబ్ నగర్‌లో మున్సిపల్ కార్మికుల మృతి ఘటన తరహాలోనే మరో విషాద ఘటన వెలుగుచూసింది. కనీస రక్షణ చర్యలు లేకపోవడంతో నాలాలో పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బంజారాహిల్స్‌లో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 13 Aug 2021, 10:06 pm
మ్యాన్‌హోల్‌లో పడి ఇద్దరు మున్సిపల్ కార్మికులు మృతి చెందిన ఘటన మరువక ముందే నగరంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. నాలాలో పడి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. బంజారాహిల్స్‌లోని పెన్షన్ ఆఫీస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బల్కాపూర్ నాలాలో పడిపోవడంతో అక్కడికక్కడే అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ నాలాలో పడిపోతుండగా గమనించిన స్థానికులు వెంటనే అతన్ని బయటికి తీసేందుకు ప్రయత్నించారు. నాలా నుంచి బయటికి తీసుకొచ్చేలోపే అతను ప్రాణాలు కోల్పోయాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
nala


నాలాలో పూడిక తీసేందుకు కొద్దిరోజుల కిందట అక్కడ ఉన్న రక్షణ గోడలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారని.. పనులు పూర్తయ్యాక తిరిగి రక్షణ ఏర్పాటు చేయలేదని స్థానికులు చెబుతున్నారు. కనీసం ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఉన్నా ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. జీహెచ్‌ఎంసీ ఇంజనీర్ల పర్యవేక్షణా లోపంతోనే జరిగిందని స్థానికులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వరుస మరణాలతో జీహెచ్‌ఎంసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల ప్రాణాలకు విలువే లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.