యాప్నగరం

భార్య చెల్లెలిపై మనసు.. మరదలితో బావ వ్యవహారం.. చివరికి..

కట్టకున్న భార్యకి ద్రోహం చేసి ఆమె సొంత చెల్లెలితోనే ప్రేమాయణం నడిపాడో భర్త. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ఇంటి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఎంట్రీ ఇస్తున్నారని తెలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Samayam Telugu 28 Oct 2021, 9:44 pm
భార్య చెల్లెలిపై మనసు పారేసుకున్నాడో భర్త. అక్కకి తెలియకుండా చెల్లెలితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. అదను చూసి మరదలితో చెక్కేశాడు. దీంతో భార్య, అత్తమామలు పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఆ విషయం తెలుసుకున్న జంట మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. బావ ఉరేసుకోగా మరదలు మాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించారు. యువకుడు ప్రాణాలు కోల్పోగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తిరుపతిలో ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ యువకుడి విషాద ఘటన వివరాలు..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
affair


నగరంలోని చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన నవీన్(26)కి చాంద్రాయణగుట్టకు చెందిన బ్రహ్మేశ్వరితో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వారికి ఒక కుమారుడు సంతానం. భార్య చెల్లెలు భువనేశ్వరిపై మనసు పడిన నవీన్ ఆమెతో ప్రేమాయణం సాగించాడు. అక్కకి తెలియకుండా మరదలితో వ్యవహారం నడిపించాడు. రెండు రోజుల కిందట అదను చూసి బావా మరదళ్లు ఇంటి నుంచి వెళ్లిపోయి తిరుపతికి చేరుకున్నారు.

అక్క భర్తతో చెల్లెలు వెళ్లిపోయిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ విషయం తెలుసుకున్న జంట దిక్కుతోచని స్థితిలో అఘాయిత్యానికి ఒడిగట్టింది. తిరుపతిలోని లాడ్జిలో ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బావ నవీన్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. భువనేశ్వరి మాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించింది. ప్రస్తుతం ఆమె రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.