యాప్నగరం

కోర్టు ఆర్డర్ ఉన్నా ఇల్లు కూల్చేశారు.! బాధితుడి ఆక్రోశం.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కారుకి అడ్డుపడి..

జీహెచ్‌ఎంసీ అధికారులు అనుమతులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని.. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చివేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. కమిషనర్ కారుకి అడ్డుపడి నిరసన తెలిపాడు.

Samayam Telugu 12 Aug 2021, 8:37 pm
ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నా అనుమతులు ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని.. ఇంటిని కూల్చేశారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి జీహెచ్‌ఎంసీ కమిషనర్ కారుకి అడ్డుపడి నిరసన తెలిపాడు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ ఇంటిని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. హుమాయున్ నగర్‌కి చెందిన సయ్యద్ నసీరుల్లాహసన్ జహీద్ ఇంటి నిర్మాణం కోసం జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుమతులు ఇవ్వకుండా అధికారులు వేధింపులకు దిగారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. భవన నిర్మాణానికి సంబంధించి కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోకుండా కూల్చేశారని సయ్యద్ వాపోయాడు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఆయన కారు ముందు కూర్చుని నిరసన తెలిపాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగాడు. ఆయన్ను అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్లేందుకు సిబ్బంది నానాతంటాలు పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu నిరసన తెలుపుతున్న సయ్యద్
protest


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.