యాప్నగరం

ఇక పట్టాలపైకి MMTS రైళ్లు.. రైల్వేశాఖ అనుమతులు, ఎప్పటినుంచంటే..

MMTS Hyderabad: కోవిడ్ లేకముందు రోజూ ఎంఎంటీఎస్ లోకల్ రైళ్లలో 1.6 లక్షల మంది ప్రయాణించేవారు. కనీస టికెట్ ధర రూ.5 ఉండగా.. గరిష్ట టికెట్ ధర రూ.15గా ఉండేది.

Samayam Telugu 20 Jun 2021, 5:51 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్
  • వచ్చే వారం నుంచి లోకల్ రైళ్లు
  • కరోనా వల్ల ఆగిపోయిన రైళ్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఎంఎంటీఎస్ రైలు
mmts trains
హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు నడిచేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. కరోనా విజృంభణతో హైదరాబాద్ సిటీలో ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు పునః ప్రారంభం కానున్నాయి. వచ్చే వారం నుంచి ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నగరంలోని దిగువ, మధ్యతరగతి ప్రజలకు, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ఇతరులకు ఎంఎంటీఎస్‌తో ఎంతో మేలు కలగనుంది.
అయితే కరోనా నిబంధనలను పాటిస్తూ, తిరిగి సర్వీసులను పునరుద్ధరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రజలందరూ కరోనా నియమాలను పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎంఎంటీఎస్ సేవలను వాడుకోవాలని కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఎంఎంటీఎస్ సర్వీసుల పునరుద్ధరణకు అంగీకరించిన కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్‌కు మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర హోంశాఖసహాయ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి పీయూశ్ గోయల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాతే ఈ ప్రకటన వచ్చింది.

ఎంఎంటీఎస్ ఇలా..
కోవిడ్ లేకముందు రోజూ ఎంఎంటీఎస్ రైళ్లలో 1.6 లక్షల మంది ప్రయాణించేవారు. కనీస టికెట్ ధర రూ.5 ఉండగా.. గరిష్ట టికెట్ ధర రూ.15గా ఉండేది. ఎంఎంటీఎస్ ద్వారా రైల్వేకు రోజుకు రూ.9 లక్షల మేర ఆదాయం సమకూరేది. సికింద్రాబాద్-లింగంపల్లి, నాంపల్లి-లింగంపల్లి, సికింద్రాబాద్-ఫలక్‌నుమా మార్గాల్లో దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీఎస్ సర్వీసులను నడుపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.