ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్.. 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మజ్లిస్ నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. మన పూర్వీకులు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్న ఓవైసీ.. ఆకలి లేని, దోపిడీ, దౌర్జన్యాల్లేని భారతావని కోసం కూడా వారు పోరాడారని ఓవైసీ గుర్తు చేశారు. వారి పోరాటాన్ని మన ముందుకు తీసుకెళ్లాలని హైదరాబాద్ ఎంపీ పిలుపునిచ్చారు.
అల్లా మన దేశాన్ని విద్వేషం నుంచి, అణచివేత నుంచి కాపాడాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేసిన ఓవైసీ.. ఇండియా ఎట్ 75 అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. త్రివర్ణ పతకం ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. మనం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు అవుతున్నప్పటికీ.. ఇప్పటికీ ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని.. దోపిడీ, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని అర్థం వచ్చేలా ఓవైసీ ట్వీట్ చేశారు. దేశంలో విద్వేషం, అణచివేత ఇంకా ఉన్నాయని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
అల్లా మన దేశాన్ని విద్వేషం నుంచి, అణచివేత నుంచి కాపాడాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేసిన ఓవైసీ.. ఇండియా ఎట్ 75 అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. త్రివర్ణ పతకం ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. మనం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు అవుతున్నప్పటికీ.. ఇప్పటికీ ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని.. దోపిడీ, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని అర్థం వచ్చేలా ఓవైసీ ట్వీట్ చేశారు. దేశంలో విద్వేషం, అణచివేత ఇంకా ఉన్నాయని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.