యాప్నగరం

Asaduddin Owaisi: స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఓవైసీ.. మజ్లిస్ నేత ఇంట్రెస్టింగ్ ట్వీట్

Asaduddin Owaisi: హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన పూర్వీకులకు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడారని.. ఆకలి లేని, దోపిడీ దౌర్జన్యాలేని భారతావని కోసం కూడా పోరాడారని ఓవైసీ గుర్తు చేశారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 15 Aug 2022, 7:02 am
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్.. 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మజ్లిస్ నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. మన పూర్వీకులు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్న ఓవైసీ.. ఆకలి లేని, దోపిడీ, దౌర్జన్యాల్లేని భారతావని కోసం కూడా వారు పోరాడారని ఓవైసీ గుర్తు చేశారు. వారి పోరాటాన్ని మన ముందుకు తీసుకెళ్లాలని హైదరాబాద్ ఎంపీ పిలుపునిచ్చారు.
Samayam Telugu Owaisi
Asaduddin Owaisi


అల్లా మన దేశాన్ని విద్వేషం నుంచి, అణచివేత నుంచి కాపాడాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేసిన ఓవైసీ.. ఇండియా ఎట్ 75 అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. త్రివర్ణ పతకం ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. మనం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు అవుతున్నప్పటికీ.. ఇప్పటికీ ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని.. దోపిడీ, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని అర్థం వచ్చేలా ఓవైసీ ట్వీట్ చేశారు. దేశంలో విద్వేషం, అణచివేత ఇంకా ఉన్నాయని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.

రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.