యాప్నగరం

బోనమెత్తిన భాగ్యనగరం... తరలివస్తున్న భక్త జనం

బోనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు. అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రెండు రోజుల పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

Samayam Telugu 1 Aug 2021, 10:34 am
భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. జంటనగరాల్లో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని ఏ వీధిలో చూసినా బోనాల సందడే కనిపిస్తోంది. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు కనుల పండువగా సాగుతున్నాయి.
Samayam Telugu బోనాల సందడి


అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆదివారన బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు. బోనాలు తీసుకువచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అలాగే అమ్మవారి ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ, రేపు ట్రాఫిక్‌ నగరంలో ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

ఆదివారం అర్ధరాత్రి జరిగిన బలిగంప పూజతో సింహవాహిని అమ్మవారి జాతర ప్రారంభమైంది. భక్తులు తెల్లవారుజామున అభిషేకం నిర్వహించగా.. అలంకరణ అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. లాల్‌ దర్వాజ సింహవాహిని ఆలయంలో సోమవారం రంగంతో పాటు అంబారీ ఊరేగింపు కార్యక్రమాలు జరుగనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.