హైదరాబాద్: ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కేసులో తొలుత ఆటో డ్రైవర్లపై అనుమానాలు వ్యక్తమైనా.. అసలు తప్పు బాధితురాలిదేనని తేలింది. ఎవరూ ఆమెను కిడ్నాప్ చేయలేదని, అత్యాచారం చేయలేదని రాచకొండ సీపీ స్పష్టం చేశారు. తల్లికి భయపడి ఆమె కిడ్నాప్ డ్రామా ఆడిందన్నారు. ఆమె గురించి మీడియాలో ఇంతకు ముందు వచ్చిన కథనాలు సరైనవి కావన్నారు. ఆటో యూనియన్లు తమకు ఎంతగానో సహకరించారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఆటో డ్రైవర్పై బాధితురాలు తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు.
ఫార్మసీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిందా..?
హైదరాబాద్ శివార్లలో ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కేసు అనేక మలుపు తిరిగింది. బాధితురాలే అసలు వ్యూహకర్త అని తేలింది. ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయకపోయినా.. నాటకాలు ఆడిందని పోలీసులు తేల్చారు.
Samayam Telugu 13 Feb 2021, 5:00 pm
ప్రధానాంశాలు:
- ఫార్మసీ స్టూడెంట్ కిడ్నాప్ ఆపై గ్యాంగ్ రేప్
- కేసు నమోదు చేసిన పోలీసులు
- విచారణలో సంచలన విషయాలు