యాప్నగరం

Be Alert: దసరాకు ఊరెళ్తున్నారా.. ఆదమరిస్తే అంతే.. తస్మాస్ జాగ్రత్త !

దసరా పండుగ వేళ హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు (Hyderabad Police) హెచ్చరిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు (thieves) దోపిడీకి తెగబడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. విలువైన అభరణాలు, నగదు బ్యాంకు లాకర్లలో (Bank Lockers) దాచుకుంటే మంచిదని చెబుతున్నారు. సీసీ కెమెరాలు, సెంట్రల్ లాక్ సిస్టమ్, సెక్యూరిటీ అలారం పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఊరెళ్లే విషయాన్ని స్థానిక పోలీసు స్టేషన్‌లో తెలియజేయాలని చెబుతున్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 1 Oct 2022, 2:14 pm
తెలుగు రాష్ట్రాల్లో దసరా (Dussehra) పెద్ద పండుగ. ముఖ్యంగా తెలంగాణలోని (Telangana) ఊరూ వాడా దసరా పండుగను ఘనంగా జరపుకుంటారు. బతుకుదెరవు, చదువులు, ఉద్యోగాలంటూ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలు, పట్టణాల్లో నివిస్తున్న వారంతా దసరా వచ్చిందంటే చాలు సొంతూళ్లకు పయనమవుతారు. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ఇవ్వటంతో చాలా మంది పల్లెటూళ్ల బాట పట్టారు. అయితే.. ఊరెళ్లే వారికి పోలీసులు (Police) హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఊరికి వెళ్తున్నామనే హడావుడిలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. పండక్కి వెళ్లి తిరిగొచ్చేసరికి మీ ఇళ్లు గుళ్ల కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. పండుగల వేళ దొంగలు (thieves) రెచ్చిపోయి తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దోపిడీకి పాల్పడే అవకాశం ఉందని.., అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Samayam Telugu thift new
దొంగతనం


సొంతూళ్లకు వెళ్లే ముందు ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) సూచిస్తున్నారు. విలువైన అభరణాలు, వస్తువులు, డబ్బు బ్యాంకు లాకర్లలో లేదా రహస్య ప్రదేశాల్లో దాచుకోవాలని చెబుతున్నారు. ఊరెళ్లే ముందు ఇంటి ఓనర్లకు, పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇంట్లో సెక్యూరిటీ అలారం (Security Alarm), సెంట్రల్ లాక్ సిస్టమ్ (Central Lock System) ఏర్పాటు చేసుకుంటే ఉత్తమనని సూచిస్తున్నారు. సీసీ కెమెరాలు (CC Cameras) ఏర్పాటు చేసుకొని మెుబైల్ ద్వారా కనెక్ట్ అయి అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు.

నమ్మకమైన వారినే సెక్యూరిటీ గార్డులుగా (Security Gard's), వాచ్‌మెన్లుగా నియమించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మెయిన్ డోర్ లాక్ చేసినట్లు కనిపించకుండా తలుపులకు అడ్డంగా కర్టెన్లు ఉంచాలన్నారు. ఇంట్లో అన్ని లైట్లు (Lights) ఆర్పేయకుండా కొన్ని నిరంతరం వెలిగేలా స్విచ్ ఆన్ చేసి ఉంచాలన్నారు. తద్వారా ఇంట్లో మనుషులు ఉన్నారని భావించి దొంగలు ఆ ఇంటికి దోపిడి వచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు. కాలనీల్లో దొంగతనాలు అరికట్టేందుకు కాలనీవాసులతో స్వచ్ఛంద కమిటీలు ఏర్పాటు చేసుకోవటం మంచిదన్నారు. ఊరెళ్లే విషయాన్ని స్థానిక పోలీసు స్టేషన్‌లో (Police Station) సమాచారం ఇస్తే ఉత్తమమన్నారు.

పండుగ వేళ తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దోపిడీ దొంగలు (thieves) రెచ్చిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో నిఘా పెంచామని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో గస్తీ పెంచామని చెప్పారు. పెట్రోలింగ్ వాహనాలు కాలనీల్లో నిరంతరం తిరుగుతాయని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసు వాట్సాప్‌ నంబర్‌ 94906 17444కు లేదా డయల్‌ 100కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని పోలీసులు కోరుతున్నారు.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.