యాప్నగరం

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ముగ్గురు అరెస్ట్.. సంచలన విషయం బయటపెట్టిన సీపీ

ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

Samayam Telugu 11 Jan 2021, 4:46 pm
హైదరాబాద్‌: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ కేసులో మరో ముగ్గుర్నిఅరెస్ట్ చేసిన నిందితులు వాడిన మొబైల్ ఫోన్లు, వాహనాల నకిలీ నంబర్‌ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ సమయంలో తెలివిగా వాహనాలకు నకిలీ నంబర్ ప్లేట్లను బిగించారని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ వెల్లడించారు. ఈ కిడ్నాప్ కేసులో టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి అఖిలప్రియ రిమాండ్‌ ఖైదీగా చంచల్‌గూడ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
Samayam Telugu Anjani Kumar
Hyderabad commissioner of police Anjani Kumar. (File photo)


ఈ కిడ్నాప్ ఎపిసోడ్ కోసం నిందితులు 6 సిమ్‌ కార్డులు వాడినట్లు అంజనీ కుమార్ వెల్లడించారు. మల్లిఖార్జున్‌రెడ్డి, మాదాల శ్రీను పేర్లతో నిందితులు సిమ్‌కార్డులు కొన్నారని.. ఈ సిమ్‌ నంబర్‌ను అఖిలప్రియ కూడా ఉపయోగించారని అంజనీ కుమార్ తెలిపారు.

ఆమె అనుచరుడు సంపత్‌ కుమార్‌ను అరెస్టు చేశామన్న సీపీ.. కిడ్నాప్ చేసే ముందు అఖిల ప్రియ సూచనల మేరకే నిందితులు రెక్కీ నిర్వహించారని తెలిపారు. రెక్కీ సమచారాన్ని భార్గవరామ్‌, గుంటూరు శ్రీనుకు ఇచ్చారన్నారు. కిడ్నాపర్లతో అఖిల ప్రియ తరచూ మాట్లాడారని.. ఇందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అంజనీ కుమార్ తెలిపారు. కిడ్నాప్ జరిగిన రోజు రాత్రి కిడ్నాపర్లు డీసీపీకి ఫోన్‌ చేశారని.. బోయిన్‌పల్లి సోదరుల్ని వదిలేస్తున్నట్లు చెప్పారు. అఖిల ప్రియ ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.