యాప్నగరం

డ్రగ్స్ కేసులో తొలిరోజు కస్టడీ.. వేర్వేరుగా విచారణ, కాల్‌డేటాపై ఆరా

పబ్‌‌లో డ్రగ్స్ కేసులో నిందితులను పోలీసులు విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ ఎలా వచ్చాయి.. కస్టమర్ల వివరాలు.. ఫోన్ కాల్ డేటా రిపోర్ట్ ఆధారంగా పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు.

Samayam Telugu 14 Apr 2022, 9:29 pm
రాష్ట్రంలో సంచలనంగా మారిన పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్టు అనుమతి మేరకు నిందితులు అనిల్, అభిషేక్‌లను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈరోజు ఉదయం నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వేర్వేరుగా విచారణ జరిపారు. ఇద్దరినీ సుమారు 6 గంటలకు పైగా ప్రశ్నించారు. వారిద్దరి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగించారు.
Samayam Telugu drugs


పబ్‌ పార్టనర్స్, లావాదేవీల నిర్వహణపై కూడా పోలీసులు ఆరా తీశారు. డ్రగ్స్ వ్యవహారంపై మేనేజర్ అనిల్‌ను పోలీసులు విచారణ జరిపినట్లు తెలుస్తోంది. అభిషేక్ ఫోన్ కాల్ డేటా రిపోర్ట్ ఆధారంగా కీలక విషయాలపై ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఒక ఏసీపీ, నలుగురు ఇన్‌స్పెక్టర్లు విచారణ జరిపారు. తొలుత నిందితులు పోలీసు విచారణకు అంతగా సహకరించలేదని.. సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది.

ఈ కేసులో ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు, రాజకీయ నేతల పిల్లలు చిక్కుకున్నారు. డ్రగ్స్ తీసుకుని ఉంటారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తాము పార్టీకే వెళ్లామని.. పోలీసులు రైడ్ చేసే వరకూ డ్రగ్స్ వ్యవహారం తమకు తెలియదని పబ్‌కి వచ్చిన వారు చెబుతున్నారు. తాము పూర్తిగా పోలీసు విచారణకు సహకరిస్తామని.. అందరినీ దోషులుగా చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.