యాప్నగరం

Hyderabad: 90 లక్షలతో పట్టుబడ్డ ఈటల పీఏ డ్రైవర్

Hyderabad: మునుగోడు ఉప ఎన్నిక వేళ వరుసగా భారీ ఎత్తున నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నా.. కొందరు వ్యక్తులు ఎలాంటి జంకు లేకుండా నగదును తరలిస్తున్నారు. అయితే.. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో.. నేతలు నగదు పంపిణీకి తెరలేపినట్టు తెలుస్తోంది. ఇందుకోసమే భారీగా నగదును తరలిస్తున్నారన్న వార్తలు రావటంతో.. పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మరో 90 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 31 Oct 2022, 3:24 pm
Hyderabad: మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి ఇంకా ఒక్కరోజే సమయం ఉండగా.. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ.. సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు పంచుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఇప్పటికే.. చాలా చోట్ల చెక్ పోస్టులు పెట్టి ముమ్మర తనిఖీలు చేస్తున్న పోలీసులకు పెద్దఎత్తున్న నగదు పట్టుబడింది. కాగా.. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని రోడ్ నంబర్ 71లో ఓ కారులో రూ.90 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని ఓ నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో పోలీసులు నగదును సీజ్ చేశారు. అయితే.. ఈ సొమ్ము కూడా మునుగోడుకే తరలిస్తున్నారా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారు.. ఎవరు పంపించారు.. ఎవరికి అందిచనున్నారు.. లాంటి ప్రశ్నలపై కూపీ లాగుతున్నారు. పట్టుబడ్డ వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పీఏ జనార్దన్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్న కటారి శ్రీనివాస్‌గా జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు.
Samayam Telugu Munugode By elections.


కాగా.. ఈ నెల 27న అర్ధరాత్రి సమయంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో.. 70 లక్షల నగదు పట్టుబడింది. ఇద్దరు వ్యక్తులు పంజాగుట్ట నుండి సోమాజిగూడ మీదుగా వెళ్తుండగా.. అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు తనిఖీలు చేసి.. నగదును పట్టుకున్నారు. 70 లక్షల నగదుతో పాటు.. కిషన్ రావు, వేముల‌ వంశీ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. నగదు సమకూర్చిన మరొక నిందితుడు మధు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో కిషన్ రావు అనే వ్యక్తి.. నిజాం కాలేజీలో అసిస్టెంట్ ప్రిన్స్‌పల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.