యాప్నగరం

ఇతడు వాళ్లను మాత్రమే కసితీరా చంపుతాడు! ఇప్పటిదాకా 16 మందిని.. సైకో కిల్లర్ అరెస్టు

Hyderabad Police: 2009లో జరిగిన నార్సింగి మహిళ హత్య కేసులో అతనికి జీవిత కాలం జైలు శిక్ష పడింది. అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో పోలీసులు వెంటనే అతని ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 26 Jan 2021, 4:19 pm
ఇతను ఒక సైకో. ఒంటరిగా మహిళలు కనబడితే చాలు హత్య చేసేస్తాడు. కసితీరా పోడిచి అతి దారుణంగా హత్య చేసి అక్కడినుండి పారిపోతాడు. ఇప్పటివరకు 16 హత్య చేశాడు. అయితే ఈ కరుడుగట్టిన సీరియర్ కిల్లర్‌ను పట్టుకోవడానికి హైదరాబాద్, రాచకొండ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసుల జాయింట్ ఆపరేషన్ వేటలో చివరకు సీరియర్ కిల్లర్ దొరికిపోయాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్, రాచకొండ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో కరడుగట్టిన సీరియల్ కిల్లర్‌ను అరెస్ట్ చేశామని సీపీ మంగళవారం తెలిపారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
hyderabad rachakonda police


ఈ సీరియల్ కిల్లర్ పేరు మైనా రాములు. మొదటి హత్య ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను హత్య చేశాడు. దీంతో పోలీసుల వేట కొనసాగింది. ఇప్పటి వరకు 21 సార్లు నిందితుడు మైనా రాములును అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. నిండితుడిపై 16 మర్డర్, 4 దోపిడీ, 1 పోలిస్ కష్టడీ నుండి తప్పించుకున్న కేసు కూడా ఉంది. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘మైనా రాములు చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాడు. తన భార్య మైనా రాములుతో ఉండలేక వేరే వారితో వెళ్లి పోయింది. అప్పటి నుండి మహిళలపై కక్ష్య పెంచుకున్నాడు. దీంతో మెంటల్‌గా అప్సెట్ అయ్యాడు. అప్పటి నుండి హత్యలు చేస్తూ వస్తున్నాడు.

‘‘2003 లో తుఫ్రాన్ పీఎస్ లిమిట్స్‌లో మొదటి హత్య చేశాడు. ఒంటరి మహిళలను టార్గెట్‌గా పెట్టుకొని వారిని తీసుకెళ్ళి హత్య చేసేవాడు. 2003 నుండి అతనిపై కేసులు ఉన్నాయి. ఇతని చేతిలో హత్యకు గురైన వారందరు కూడా మహిళలే. మెదక్ జిల్లా తూప్రాన్, సంగారెడ్డి, నరసాపూర్, బోయినపల్లిలో ఇద్దర్ని హత్య చేశాడు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 మంది మహిళలను హత్యలు చేశాడు.

2009లో జరిగిన నార్సింగి మహిళ హత్య కేసులో అతనికి జీవిత కాలం జైలు శిక్ష పడింది. అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో పోలీసులు వెంటనే అతని ఆస్పత్రికి తరలించారు. అయితే రాములు పోలీసుల కళ్లుగప్పి ఆస్పత్రి నుండి తప్పించుకున్నాడు. 2011లో ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రి నుండి తప్పించుకున్నాడు.

మళ్లీ 2013 లో కూడా బోయినపల్లి పోలీసులు రాములును అరెస్ట్ చేశారు. మళ్ళీ 2018 లో జైలు నుండి విడుదలై వచ్చిన తరువాత వరుసగా రెండు హత్యలకు పాల్పడ్డాడు.’’ అని సీపీ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.