యాప్నగరం

Araku Accident: బస్సులో షేక్‌పేట వాసులు.. ఒకే కుటుంబానికి చెందిన 26 మంది.!

హైదరాబాద్‌లోని షేక్‌పేట వాసులు ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందిన వారిగా సమాచారం. సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

Samayam Telugu 14 Feb 2021, 4:20 pm
ఏపీలోని విశాఖపట్నం జిల్లా అరకులోయలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అరకు ఘాట్‌రోడ్డులో బస్సు అదుపుతప్పి లోయలోకి బోల్తా పడింది. అనంతగిరి మండలం డముకు సమీపంలోని 5వ నంబర్ మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని ప్రయాణికులంతా హైదరాబాద్‌‌కి చెందిన వారిగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వ్యక్తులు నగరంలోని షేక్‌పేటకి చెందిన వారిగా గుర్తించారు. షేక్‌పేటలోని ఒకే కుటుంబానికి చెందిన 26 మంది బస్సులో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో సత్యనారాయణ, లత, శ్రీనిత్య, సరిత మృతి చెందారు. కొట్టం జ్యోతి, కొట్టం నరసింహన్న, కొట్టం కళావతి, కొట్టం కళ్యాణి, కొట్టం నరేష్, కొట్టం స్వప్న, కొట్టం అనిత తదితరులు గాయపడ్డారు. ప్రమాదంలో 20 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Samayam Telugu ప్రమాదానికి గురైన బస్సు
araku accident


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.