యాప్నగరం

పాతబస్తీలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు

Hyderabad: పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ జోన్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. 150 మంది పోలీసులు ఫ్లాగ్ మార్చ్‌లో పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఫలక్‌నుమా డివిజన్‌లో 600 గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేయొద్దని ఏసీపీ జహంగీర్ హెచ్చరించారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 1 Sep 2022, 11:41 pm
హైదరాబాద్: పాతబస్తీలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ జోన్ పోలీసులు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. 150 మంది పోలీసులు ఫ్లాగ్ మార్చ్‌లో పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఫలక్‌నుమా డివిజన్‌లో 600 గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రజలు పండగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని, వదంతులను నమ్మొద్దని సూచించారు. వదంతులను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Samayam Telugu Hyderabad Old City
పాతబస్తీ పోలీసులు


సోషల్ మీడియాలో ఎలాంటి వివాదాస్పద పోస్టులు పెట్టరాదని ఏసీపీ జహంగీర్ హెచ్చరించారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫలక్‌నుమా ఏసీపీ షేక్ జహంగీర్‌తో పాటు సౌత్ జోన్ పోలీసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.