హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో అదృశ్యమై జిన్నారం ప్రాంతంలో శవమై తేలిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నారాయణరెడ్డి ఉదంతం కలకలం రేపుతోంది. తమకు ఇష్టం లేకపోయినా అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే ఆగ్రహం, ఆ అమ్మాయికి మరో యువకుడితో పెళ్లి చేయాలనే పంతంతో యువకుడి పట్ల అమానుషంగా వ్యవహరించారు యువతి తల్లిదండ్రులు. యువకుడిది కూడా వారి సామాజికవర్గమే, పైగా సాఫ్ట్వేర్ ఇంజినీర్.. అన్న విచక్షణ మరిచి గొంతు నులిమి చంపేయడంతో పాటు మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. తమ కొడుకు ఎక్కడున్నా క్షేమంగా తిరిగొస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకొండపల్లికి చెందిన నారాయణరెడ్డి (26) సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కందుల వెంకటేశ్వరరెడ్డి కూతురు రవళితో ప్రేమలో పడ్డాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని కోరగా రవళి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో గతేడాది వారు ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. పెద్దల నుంచి ప్రాణహాని ఉందన్న భయంతో ఢిల్లీకి వెళ్లిపోయి అక్కడే ఉన్నారు. కొద్ది నెలల తర్వాత నారాయణరెడ్డి కూతురు అల్లుడితో మాటలు కలిపి దగ్గరయ్యాడు. అమ్మాయిని ఒక్కసారి ఇంటికి పంపించాలని నారాయణరెడ్డిని కోరగా భార్యని పుట్టింటికి పంపాడు.
అయితే తమ ఇంటికి వచ్చిన రవళిని తల్లిదండ్రులు హౌస్ అరెస్టు చేశారు. భర్తతో మాట్లాడకుండా కట్టడి చేశారు. ఆ పరిణామాలను అర్థం చేసుకున్న నారాయణ రెడ్డి, ఎలాగైనా భార్యను దక్కించుకోవాలనుకొని తన మకాంను ఢిల్లీ నుంచి హైదరాబాద్కు మార్చాడు. ఇక్కడే ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చూసుకొని కేపీహెచ్బీ కాలనీ రోడ్డు నంబర్ 1లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. తన భార్యను అప్పగించాలంటూ రవళి కుటుంబసభ్యులపై హెక్టోరులో పిటిషన్ వేశాడు. అయితే కోర్టు రవళి అభిప్రాయం అడగ్గా పేరెంట్స్ వద్దే ఉంటానని చెప్పింది. అనంతరం రవళికి మరో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుండగా రిజెక్ట్ చేస్తోంది. మరోవైపు ఇంట్లో వాళ్లకు తెలియకుండా భర్తతో తరుచూ ఫోన్లో మాట్లాడుతోంది. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వరరెడ్డి.. నారాయణరెడ్డిని చంపేయాలని నిర్ణయించుకుని తన బంధువులు శ్రీనివాసరెడ్డిని సంప్రదించారు.
జూన్ 27న రాత్రి శ్రీనివాసరెడ్డి తన అనుచరులు కాశీ, ఆశిక్లతో కలిసి నారాయణరెడ్డిని కారులో ఎక్కించుకుని ఖాజాగూడ వైపు తీసుకెళ్లారు. ఖాజాగూడలో మద్యం కొని జిన్నారం వైపు వెళ్లారు. నారాయణరెడ్డిని మార్గమధ్యంలో గొంతు నులిమి చంపేశారు. జిన్నారం శివార్లలోని అడవిలోకి మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేసి పరారయ్యారు. గది నుండి బయటకు వెళ్లిన నారాయణరెడ్డి తిరిగి రాకపోవడంతో రూమ్మేట్ అతడి కుటుంబసభ్యులకు చెప్పాడు. నారాయణరెడ్డి ఆచూకీ ఎక్కడా లభించకపోవడంతో జూన్ 30న కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నారాయణరెడ్డి సెల్ఫోన్ కాల్డేటా ఆధారంగా ఆసిఫ్ను అదుపులోకి విచారించగా మర్డర్ మిస్టరీ వీడింది. ఆసిఫ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు జిన్నారం మండలం నల్లూరు గ్రామ శివారులో పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో వెంకటేశ్వరరెడ్డిని, శ్రీనివాస్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే తమ ఇంటికి వచ్చిన రవళిని తల్లిదండ్రులు హౌస్ అరెస్టు చేశారు. భర్తతో మాట్లాడకుండా కట్టడి చేశారు. ఆ పరిణామాలను అర్థం చేసుకున్న నారాయణ రెడ్డి, ఎలాగైనా భార్యను దక్కించుకోవాలనుకొని తన మకాంను ఢిల్లీ నుంచి హైదరాబాద్కు మార్చాడు. ఇక్కడే ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చూసుకొని కేపీహెచ్బీ కాలనీ రోడ్డు నంబర్ 1లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. తన భార్యను అప్పగించాలంటూ రవళి కుటుంబసభ్యులపై హెక్టోరులో పిటిషన్ వేశాడు. అయితే కోర్టు రవళి అభిప్రాయం అడగ్గా పేరెంట్స్ వద్దే ఉంటానని చెప్పింది. అనంతరం రవళికి మరో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుండగా రిజెక్ట్ చేస్తోంది. మరోవైపు ఇంట్లో వాళ్లకు తెలియకుండా భర్తతో తరుచూ ఫోన్లో మాట్లాడుతోంది. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వరరెడ్డి.. నారాయణరెడ్డిని చంపేయాలని నిర్ణయించుకుని తన బంధువులు శ్రీనివాసరెడ్డిని సంప్రదించారు.
జూన్ 27న రాత్రి శ్రీనివాసరెడ్డి తన అనుచరులు కాశీ, ఆశిక్లతో కలిసి నారాయణరెడ్డిని కారులో ఎక్కించుకుని ఖాజాగూడ వైపు తీసుకెళ్లారు. ఖాజాగూడలో మద్యం కొని జిన్నారం వైపు వెళ్లారు. నారాయణరెడ్డిని మార్గమధ్యంలో గొంతు నులిమి చంపేశారు. జిన్నారం శివార్లలోని అడవిలోకి మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేసి పరారయ్యారు. గది నుండి బయటకు వెళ్లిన నారాయణరెడ్డి తిరిగి రాకపోవడంతో రూమ్మేట్ అతడి కుటుంబసభ్యులకు చెప్పాడు. నారాయణరెడ్డి ఆచూకీ ఎక్కడా లభించకపోవడంతో జూన్ 30న కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నారాయణరెడ్డి సెల్ఫోన్ కాల్డేటా ఆధారంగా ఆసిఫ్ను అదుపులోకి విచారించగా మర్డర్ మిస్టరీ వీడింది. ఆసిఫ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు జిన్నారం మండలం నల్లూరు గ్రామ శివారులో పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో వెంకటేశ్వరరెడ్డిని, శ్రీనివాస్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.