అన్నయ్య, వదిన అంటూ దగ్గరై.. వారి కుటుంబంలోనే చిచ్చురేపాడు ఓ వ్యక్తి! అతగాడి మోజులో పడ్డ సదరు మహిళ కూడా విచక్షణ మరిచిపోయి పశువుగా మారింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన ప్రియుడితో కలిసి అభంశుభం తెలియని తన కొడుకునే పొట్టనపెట్టుకుంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని చింతల్ భగత్ సింగ్ నగర్లో ఇటీవలే వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన సురేష్, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఉదయ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జగద్గిరిగుట్టలోనే కాపురం పెట్టారు. వీరికి ఒక కుమారుడు (3) సంతానం. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం సురేష్కు భాస్కర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. సురేష్ను భాస్కర్ తన దగ్గరే పనిలో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సురేష్ను భాస్కర్ అన్నయ్య అని పిలిచేవాడు. భాస్కర్పై నమ్మకం కుదరడంతో సురేష్ తన ఇంటికి తీసుకెళ్లి భార్యకు పరిచయం చేశాడు.
తనకు భాస్కర్ తమ్ముడి లాంటి వాడని, తనకు పని కూడా కల్పించాడని భార్య ఉదయకు సురేష్ చెప్పాడు. భాస్కర్ కూడా ఆమెను వదిన అని పిలుస్తూ ఇంట్లో సొంత మనిషిలా ఉండేవాడు. సురేష్ కూడా భాస్కర్ను సొంత తమ్ముడిలా చూసుకునేవాడు. ఈ క్రమంలోనే భాస్కర్ తనలోని నీచబుద్ధిని బయటపెట్టాడు. వదిన అంటూనే.. సురేష్ భార్య ఉదయతో చనువుగా మెలిగాడు. ఆమె కూడా భర్త, మూడేళ్ల కొడుకు ఉన్నా.. భాస్కర్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
సురేష్కు రెడ్హ్యాండెట్గా..!
ఈ క్రమంలో ఒకరోజు తన ఇంట్లోనే భాస్కర్, ఉదయ చనువుగా ఉండగా సురేష్ కంటపడ్డారు. సురేష్ను చూసిన భాస్కర్ వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. రెడ్హ్యాండెట్గా పట్టుబడ్డ భార్యను సురేష్ కోపంతో మందలించాడు. ఈ వ్యవహారమై సురేష్ నిలదీయడంతో ఉదయ.. పిల్లాడిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి చింతల్లోని భగత్సింగ్ నగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది.
పిల్లాడితో కలిసి ఒంటరిగా ఉన్న ఉదయ.. భాస్కర్తో మళ్లీ వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే మూడేళ్ల కొడుకు తమకు అడ్డుగా ఉన్నాడని ఉదయ భావించింది. ఓ రోజు చిన్నారి అన్నం తినకుండా మారాం చేయడంతో.. ఉదయ ఆ పిల్లాడిని కొట్టింది. భాస్కర్ కూడా చిన్న పిల్లాడన్న కనికరం కూడా లేకుండా విద్యుత్ వైర్తో విచక్షణారహితంగా కొట్టాడు. ఆ పిల్లాడి కడుపులో కాలితో ఎగిరెగిరి తన్నాడు. వీళ్ల దెబ్బలకు తాళలేకపోయిన ఆ పసివాడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరినీ అరెస్ట్ చేశారు. మూడేళ్ల పిల్లాడిని కనికరం లేకుండా చంపిన ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన సురేష్, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఉదయ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జగద్గిరిగుట్టలోనే కాపురం పెట్టారు. వీరికి ఒక కుమారుడు (3) సంతానం. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం సురేష్కు భాస్కర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. సురేష్ను భాస్కర్ తన దగ్గరే పనిలో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సురేష్ను భాస్కర్ అన్నయ్య అని పిలిచేవాడు. భాస్కర్పై నమ్మకం కుదరడంతో సురేష్ తన ఇంటికి తీసుకెళ్లి భార్యకు పరిచయం చేశాడు.
తనకు భాస్కర్ తమ్ముడి లాంటి వాడని, తనకు పని కూడా కల్పించాడని భార్య ఉదయకు సురేష్ చెప్పాడు. భాస్కర్ కూడా ఆమెను వదిన అని పిలుస్తూ ఇంట్లో సొంత మనిషిలా ఉండేవాడు. సురేష్ కూడా భాస్కర్ను సొంత తమ్ముడిలా చూసుకునేవాడు. ఈ క్రమంలోనే భాస్కర్ తనలోని నీచబుద్ధిని బయటపెట్టాడు. వదిన అంటూనే.. సురేష్ భార్య ఉదయతో చనువుగా మెలిగాడు. ఆమె కూడా భర్త, మూడేళ్ల కొడుకు ఉన్నా.. భాస్కర్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
సురేష్కు రెడ్హ్యాండెట్గా..!
ఈ క్రమంలో ఒకరోజు తన ఇంట్లోనే భాస్కర్, ఉదయ చనువుగా ఉండగా సురేష్ కంటపడ్డారు. సురేష్ను చూసిన భాస్కర్ వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. రెడ్హ్యాండెట్గా పట్టుబడ్డ భార్యను సురేష్ కోపంతో మందలించాడు. ఈ వ్యవహారమై సురేష్ నిలదీయడంతో ఉదయ.. పిల్లాడిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి చింతల్లోని భగత్సింగ్ నగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది.
పిల్లాడితో కలిసి ఒంటరిగా ఉన్న ఉదయ.. భాస్కర్తో మళ్లీ వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే మూడేళ్ల కొడుకు తమకు అడ్డుగా ఉన్నాడని ఉదయ భావించింది. ఓ రోజు చిన్నారి అన్నం తినకుండా మారాం చేయడంతో.. ఉదయ ఆ పిల్లాడిని కొట్టింది. భాస్కర్ కూడా చిన్న పిల్లాడన్న కనికరం కూడా లేకుండా విద్యుత్ వైర్తో విచక్షణారహితంగా కొట్టాడు. ఆ పిల్లాడి కడుపులో కాలితో ఎగిరెగిరి తన్నాడు. వీళ్ల దెబ్బలకు తాళలేకపోయిన ఆ పసివాడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరినీ అరెస్ట్ చేశారు. మూడేళ్ల పిల్లాడిని కనికరం లేకుండా చంపిన ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.