యాప్నగరం

రాత్రి యువతి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. బయటకు రమ్మని పిలవడంతో

రాత్రి 11 గంటల సమయంలో కాలనీలో ఉన్న యువతి ఇంటికి వెళ్లాడు శోభన్. ఆమెను బయటకు రావాలన్నాడు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు శోభన్‌ను మందలించారు.

Samayam Telugu 21 Jun 2021, 1:34 pm
హైదరాబాద్‌ బాలానగర్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు మందలించారని ఆవేదనతో ఒక యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. శుభం అనే యువకుడు గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో శోభన కాలనీలోని ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెను బయటకు రమ్మన్నాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అయితే యువతి బయటకు రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. యువతి ఇంటికి వెళ్లి గొడవ చేశారు. అమ్మాయి ప్రేమించడం లేదని ఆమె తల్లిదండ్రులు శుభంను మందలించారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు మందలించారని అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చివరికి అర్ధరాత్రి సమయంలో తాను బయటకు రానని యువతి తేల్చి చెప్పడంతో ప్రియుడు భవనం 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.