యాప్నగరం

డీసీఎంలో భారీగా గుట్కా తరలింపు.. సీజ్ చేసిన ఎస్ఓటీ బృందం

హయత్ నగర్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా బీదర్ కు గుట్కా ముడి సరుకులు తరలిస్తున్నారు. అక్కడ గుట్కా తయారు చేసి మళ్లీ హైదరాబాద్ కు తీసుకొని వచ్చి విక్రయిస్తామని నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు.

Samayam Telugu 13 Mar 2021, 9:15 am
రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగు రోడ్డు పై భారీగా గుట్కా ముడి సరుకులు శంషాబాద్ ఎస్ఓటి బృందం పెట్టుకున్నారు. హయత్ నగర్ నుండి డీసీఎం వాహనం లో బీదర్ కు గుట్కా ముడి సరుకులు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్ ఓటీ బృందం ఔటర్ పై మాటు వేసింది. దీంతో హిమాయత్ సాగర్ ఔటర్ పై డీసీఎం వాహనం రాగానే ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. డీసీఎం వాహనం లో వున్న 15 లక్షల రూపాయల విలువ చేసే గుట్క ముడి సరుకుల స్వాధీనం చేసుకున్నారు.
Samayam Telugu భారీ గుట్కా స్వాధీనం


గుట్కా ముడి సరుకులు తరలిస్తున్న డీసీఎం వాహనం సీజ్ చేసి, నిందితులు షేక్ మహమ్మూద్, మహమ్మద్ షరీఫ్ ను అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హయత్ నగర్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా బీదర్ కు గుట్కా ముడి సరుకులు తరలించి అక్కడ గుట్కా తయారు చేసి మళ్లీ హైదరాబాద్ కు తీసుకొని వచ్చి విక్రయిస్తామని నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు.

గతేడాది నుంచి ఈ దందా కొనసాగిస్తునట్లు సమాచారం. నిందితులు హైదరాబాద్ తలాబ్ కట్టా ప్రాంతానికి చెందిన షేక్ మహమ్మూద్ రాజేంద్రనగర్ హసన్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షరీఫ్ గా పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం లో గుట్కా తయారీ నిషేధించడంతో కొంత మంది వ్యక్తులు హైదరాబాద్ లో ముడి సరుకులు కొనుగోలు చేసి కర్ణాటక కు తరలించి అక్కడ గుట్కా తయారు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.