బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. అయితే దీని ప్రభావం తెలంగాణపై అంతగా లేకపోయే సరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాయుగుండం తెలంగాణకు దూరంగా వెళ్లిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కానీ ఈ వాయుగుండం ప్రభావంతో ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదుకావడంతో పై నుంచి వరద తెలంగాణకు చేరుకుంటోంది. ఇప్పటికే గోదావరి ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండగా.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. వాయుగుండం ముప్పు తప్పిందనుకునే లోపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ నెల 19వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. 7న వాయువ్య బంగాళఖాతంలో, 13న ఉత్తర బంగాళాఖాతంలోనూ అల్పపీడనాలు ఏర్పడగా.. మళ్లీ ఆరు రోజుల వ్యవధిలోనే 19న మరో అల్పపీడనం ఏర్పడటం కొంత ఆందోళన కలిగిస్తోంది.
గతంలో ఏర్పడిన రెండు అల్పపీడనాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రభావం చూపలేదని.. 19వ తేదీన ఏర్పడే అల్పపీడనంతో 19, 20 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.
గతంలో ఏర్పడిన రెండు అల్పపీడనాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రభావం చూపలేదని.. 19వ తేదీన ఏర్పడే అల్పపీడనంతో 19, 20 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.