యాప్నగరం

HYD: పార్టీలో మునిగిన ఆస్పత్రి సిబ్బంది.. వైద్యం అందక శిశువు మృతి

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ పసికందు మరణించింది. ప్రసవం కోసం వచ్చిన మహిళకు సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో పసికందు ప్రాణం పోయింది.

Authored byRaj Kumar | Samayam Telugu 27 Jun 2022, 10:15 am
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణిని ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో పుట్టిన పసికందు మరణించింది. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బంది తీరుపై మండిపడ్డారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


వివరాల్లోకి వెళ్తే.. చాదర్ఘాట్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం తాజాగా వెలుగు చూసింది. ఆస్పత్రి బిల్డింగ్పై ఓ వివాహానికి ముందస్తు పార్టీ నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆస్పత్రి సిబ్బంది మునిగిపోయింది. డీజే సిస్టం పెట్టుకొని ఆటపాటలతో డ్యాన్సులు చేస్తూ వేడుకలు చేసుకుంది. ఇటు ప్రసవం కోసం వచ్చిన గర్భిణిని ఎవరూ పట్టించుకోలేదు. మహిళ పరిస్థితి విషమం అని తెలిసినా వైద్యులు పార్టీలో మునిగి తేలారు. దీంతో సరైన సమయంలో గర్భిణికి వైద్యం అందక శిశువు మృతి చెందింది. ఈ క్రమంలోనే ఆస్పత్రి సిబ్బందిపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.