యాప్నగరం

Hyderabad: పోలియో వ్యాక్సిన్ వికటించి నెలన్నర చిన్నారి మృతి!

Hyderabad: హైదరాబాద్‌లోని సైదాబాద్ ఖాజాబాగ్‌లో విషాదం చోటు చేసుకుంది. నెలన్నర చిన్నారి అనుమానస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. పోలియో డ్రాప్స్ వికటించటం వల్లే శిశువు మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 13 Apr 2023, 3:46 pm

ప్రధానాంశాలు:

  • సైదాబాద్ బస్తీలో విషాదం
  • నెలన్నర చిన్నారి మృతి
  • పోలియో వ్యాక్సినే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Polio Vaccine
పోలియో వ్యాక్సిన్
Polio Vaccine: హైదరాబాద్ ఐఎస్ సదన్ డివిజన్ సైదాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. 52 రోజుల చిన్నారి అనుమానస్పదసిత్థిలో మృతి చెందాడు. నిన్న (బుధవారం) బస్తీ దవాఖానాలో చిన్నారికి పోలియో డ్రాప్స్ వేయించారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం బాలు నాయక్ తండాకు చెందిన లచ్చిరాం, మౌనిక దంపతులకు ఏడాది క్రితం వివాహం జరిగింది. వీరు సైదాబాద్ ఖాజాబాగ్ గుడిసెల్లో నివాసం ఉంటుండగా.. లచ్చిరాం ఓ ప్రైవేటు కాలేజీలో స్వీపర్‌గా పనిస్తున్నాడు.
లచ్చిరాం దంపతులకు ఇటవలే కుమారుడు జన్మించాడు. చిన్నారి వయస్సు 52 రోజులు. అయితే సుబ్రమణ్యంనగర్‌ బస్తీ దవాఖానలో బుధవారం బాబుకు పోలియో చక్కలు వేయించారు. ఆ తర్వాత శిశువు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పోలియో డ్రాప్స్ వికటించటం వల్లే తమ పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సైదబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ చిన్నారి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.