యాప్నగరం

ఉరేసుకున్న ఇన్ఫోసిస్ ఉద్యోగి.. అవి నిలువునా ముంచడంతో మనస్తాపం

Patancheru: తండ్రి మంగళవారం విధులకు వెళ్లగానే, బెడ్ రూంలోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. దీనిని గమనించిన తల్లి పక్కింటి వారిని పిలిచింది.

Samayam Telugu 19 Jan 2021, 10:24 pm
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. వీటి వల్ల అప్పుల పాలైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పటాన్‌చెరులో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే రవికుమార్‌ (28) బెంగళూరులోని ఇన్ఫోసిస్‌ సంస్థలో పనిచేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. ఈ క్రమంలో రవి కుమార్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో అప్పుల పాలయ్యాడు.
Samayam Telugu రవి కుమార్ (28)
infosys employee suicide


తండ్రి ప్రభాకర్‌ మందలించి రూ.లక్ష అప్పు తీర్చినా.. ఇంకా చాలా అప్పులు అలాగే ఉన్నాయి. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురయ్యాడు. తండ్రి మంగళవారం విధులకు వెళ్లగానే, బెడ్ రూంలోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. దీనిని గమనించిన తల్లి పక్కింటి వారిని పిలిచింది. వారంతా రవిని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. వైద్యులు రవికుమార్‌ చనిపోయినట్లు నిర్ధారించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.