యాప్నగరం

SRH vs MI: హైదరాబాద్‌లో ఐపీఎల్ బెట్టింగ్.. నలుగురు అరెస్ట్, రూ. 46 లక్షలు సీజ్

SRH vs MI సన్ రైజర్స్ హైదరాబాద్ , ముంబై జట్ల మధ్య నేడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై బెట్టింగ్ పెట్టేందుకు పందెం రాయుళ్లు రెడీ అయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రూ. 46 లక్షల క్యాష్ సీజ్ చేశారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 18 Apr 2023, 3:27 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్‌లో ఐపీఎల్ బెట్టింగ్
  • నలుగురు వ్యక్తులు అరెస్ట్
  • వారి వద్ద నుంచి రూ. 46 లక్షలు సీజ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu SRH vs MI
ఐపీఎల్ బెట్టింగ్
IPL 2023: ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్డేడియంలో నేడు ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. హోం టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. రెండు వరుస ఓటములతో ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభించిన సన్ రైజర్స్.. ఆ తర్వాత పంజాబ్, కేకేఆర్ జట్లను ఓడించి జోరు మీదుంది. రాత్రి 7 గంటలకు జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరితో పాటు బెట్టింగ్ రాయుళ్లు కూడా మ్యాచ్ కోసం కాచుకొని ఉన్నారు.
భారీగా బెట్టింగ్‌లు కాసేందుకు రెడీ అయ్యారు. దీంతో అప్రమత్తమైన ఎస్‌వోటీ పోలీసులు.. పందెం రాయుళ్లుపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఇప్పటికే నగరంలో పలు బెట్టింగ్ ముఠాలను అదుపులోకి తీసుకోగా.. తాజాగా మరో ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ మైలార్ దేవులపల్లి, మోయినాబాద్ పోలీసు స్టేషన్ల పరిధిలో బెట్టింగులకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

గతరాత్రి జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వీళ్లు బెట్టింగ్ పెట్టినట్లు తెలిసింది. దీంతో పాటు ఇవాళ హైదరాబాద్‌లో జరగాల్సిన సన్ రైజర్స్, ముంబై మ్యాచ్‌కు సైతం బెట్టింగ్‌కు పాల్పడేందుకు రెడీ అయినట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం మేరకు దాడులు చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 46 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. మరికొందరు దుండగులు పరారీలో ఉండగా.. వారి కోసం గాలిస్తున్నామని రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.