యాప్నగరం

హైదరాబాద్ జనసేన పార్టీ ఆఫీస్‌లో పవన్ ప్రత్యేక పూజలు.. తెలంగాణ పాలిటిక్స్‌పై ఫోకస్ !

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోనూ పాగా వేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన జనసేనాని.., అక్టోబర్‌లో తెలంగాణలోని జనసేన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై సమాలోచననలు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో తాము గెలుపోటములు ప్రభావితం చేస్తామని.., 40 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించే సత్తా ఉందని పవన్ గతంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. తెలంగాణ పాలిటిక్స్‌పై పవన్ ఫోకస్ పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

Authored byసందీప్ పూల | Samayam Telugu 30 Sep 2022, 3:40 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్ జనసేన కార్యాలయంలో పవన్ ప్రత్యేక పూజలు
  • తెలంగాణ రాజకీయాలపై ఫోకస్
  • వచ్చే నెల పార్టీ నేతలతో సమావేశం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu pawan new
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న జనసేన (janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan).. తెలంగాణ రాజకీయాలపైనా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అక్టోబర్‌లో తెలంగాణ (Telangana) పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి బోణి కొట్టాలని జనసేనాని భావిస్తున్నట్లు సమాచారం.
దసరా నవరాత్రులను పురస్కరించుకొని హైదరబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతి దేవి రూపంలో కొలువైన అమ్మవారిని అర్చించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సకల శుభాలు కలగగాలని ప్రార్థించారు. ప్రత్యేక పూజల అనంతరం ఏపీకి చెందిన పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావశమయ్యారు. అక్టోబరు నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చించారు. త్వరలోనే జిల్లాల వారీగా సమీక్షలు చేపట్టనున్నట్లు పవన్ నేతలతో తెలిపారు. సమీక్ష సమావేశాలను విజయవాడ అర్బన్, కృష్ణా జిల్లాలతో ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళగిరిలో జరిగే ఈ సమావేశాలకు సంబంధించి పార్టీ నేతలకు పవన్ పలు సూచనలు చేశారు.

వీర మహిళలు, సోషల్ మీడియా, క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించిన వాలంటీర్లు, శతఘ్ని క్రియాశీలక సభ్యులతోనూ సమావేశం కావాలని పవన్ నిర్ణయించారు. 'నా సేన నా వంతు' (Na seva Na Vantu) పేరిట చేపట్టనున్న కార్యక్రమంపైనా సమీక్ష చేపట్టనున్నారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజలు జరిపి ధర్మపురి క్షేత్రానికి వెళ్లి శ్రీ నరసింహ స్వామిని దర్శించే విధంగా ప్రణాళిక రూపొందించాలని నేతలకు పవన్ సూచించారు.

దూకుడు పెంచి ఏపీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న పవన్ తెలగాణ రాజకీయాలపై గతంలోనే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మేలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన.. తెలంగాణలో జనసేన బలంగా ఉందని అన్నారు. తెలంగాణలో పరిమిత సంఖ్యలో జనసేన పోటీ చేయబోతోందనే హింట్ ఇచ్చారు. వచ్చే ఎన్నిక్లలో సత్తా చాటుతామని చెప్పారు. కచ్చితంగా 40 పైచిలుకు స్థానాల్లో గెలిచే సత్తా ఉందన్నారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన బలంగా ఉందని కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు సాగాలన్నారు. తాజాగా ఆయన మరోసారి తెలంగాణ పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టడం చర్చనీయాంశమైంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ (Kalvakuntla Chandrashekar rao), ఏపీ సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) మధ్య రహస్య స్నేహం కొనసాగుతోందన్నన ప్రచారం నేపథ్యంలో జనసేన తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతుందనే చర్చ సాగుతోంది. మరోవైపు ఏపీలో బీజేపీతో (BJP) దోస్తీ కట్టిన జననేన.., తెలంగాణలో ఆ పొత్తును కొనసాగిస్తుందా ?, లేక ఒంటరిగా పోటీ చేస్తుందా ? అనే చర్చ రాజకీయాల్లో వర్గాల్లో జోరందుకుంది.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.