హైదరాబాద్ నగరంలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మోసాన్ని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఎందుకంటే ఈ తరహాలో కూడా మోసం చేసే అవకాశం ఉందని వారు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాలివీ.. కర్ణాటకకు చెందిన శివయ్యతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కలిసి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టలో ఉంటున్న ఒక వ్యక్తిని కలిశారు. కర్ణాటకలో బంగారం నిధి దొరికిందని, దాని కోసం తవ్వకాలు చేస్తున్నామని, మీకు సంబంధించిన విజిటింగ్ కార్డు ఓ వ్యక్తి తమకు ఇచ్చాడని నమ్మించారు. మీరు బంగారం కొనుగోలు చేస్తారని అతను చెప్పారని శివయ్య అండ్ గ్యాంగ్ నమ్మబలికారు. ముందుగా సదరు వ్యాపారవేత్త నమ్మలేదు. వారం రోజుల తర్వాత బంగారు ఆభరణాలు తీసుకొని శివయ్య అండ్ గ్యాంగ్ హైదరాబాద్ వచ్చింది. వ్యాపారవేత్తను కలిసింది. బంగారం నిధి తీస్తున్న సమయంలో తమకు ఆభరణాలు లభ్యమయ్యాయని, వీటిని కూడా అమ్మాలని అనుకుంటున్నామని చెప్పారు. అయితే ముందుగా బంగారం షాప్ వద్దకు దాన్ని తీసుకు వెళ్లి అసలు బంగారమో కాదో పరీక్షించుకోవాలని వారు సూచించారు. దీంతో సదరు వ్యాపారవేత్త బంగారం షాప్కి వెళ్లి బంగారం నాణ్యతను చెక్ చేసుకున్నాడు. అది అసలైన బంగారమే అని తేలింది. దీంతో వ్యాపారవేత్త ఆశ పడి శివయ్య వద్ద ఉన్న బంగారు ఆభరణాలను రూ.17 లక్షలకు కొనుగోలు చేశాడు.
శివయ్య గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్లి పోయింది. సరిగ్గా వారం రోజుల తర్వాత వ్యాపారవేత్త బంగారం షాపులో వాటిని విక్రయించే ప్రయత్నం చేశారు. అయితే అవి గిల్టు నగలని తేలిపోయింది. దీంతో తాను మోసపోయానని చెప్పి బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. చివరకు కర్ణాటక కేంద్రంగా పని చేస్తున్న శివయ్య అండ్ గ్యాంగ్ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆ ముఠాకు సంబంధించి కీలక విషయాలు తెలిశాయి.
ఈ గ్యాంగ్ ప్రముఖ హోటల్ లేదా టూరిస్ట్ స్పాట్లకు వెళ్లి అక్కడ విజిటింగ్ కార్డులను సేకరిస్తుంటుంది. ఈ కార్డుల ఆధారంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి వ్యాపారవేత్తలను కలిసి బంగారం ఆభరణాల పేరు చెప్పి మోసాలకు పాల్పడుతుంటారు. ఇప్పటివరకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో చాలా మంది వ్యాపారవేత్తలను ఈ గ్యాంగ్ మోసం చేసిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
పాతబస్తీ చంద్రాయణ్ గుట్ట నకిలీ బంగారం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితులను శివయ్య, తిరుపతయ్య, ఇంద్రజుగా గుర్తించామని అన్నారు. నిందితుల నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. వీరు మైసూర్లో లంకె బిందెలు దొరికాయి. కొంటారా అని మాటలు చెప్పారు. మొదట అసలు బంగారం చూపించి చెక్ చేసుకోమని చెబుతారు. తరువాత నకిలీ బంగారం ఇచ్చి మోసం చేశారు. వీళ్ళపై పాత కేసులు కుడా ఉన్నాయి.’’ అని సీపీ తెలిపారు.
శివయ్య గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్లి పోయింది. సరిగ్గా వారం రోజుల తర్వాత వ్యాపారవేత్త బంగారం షాపులో వాటిని విక్రయించే ప్రయత్నం చేశారు. అయితే అవి గిల్టు నగలని తేలిపోయింది. దీంతో తాను మోసపోయానని చెప్పి బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. చివరకు కర్ణాటక కేంద్రంగా పని చేస్తున్న శివయ్య అండ్ గ్యాంగ్ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆ ముఠాకు సంబంధించి కీలక విషయాలు తెలిశాయి.
ఈ గ్యాంగ్ ప్రముఖ హోటల్ లేదా టూరిస్ట్ స్పాట్లకు వెళ్లి అక్కడ విజిటింగ్ కార్డులను సేకరిస్తుంటుంది. ఈ కార్డుల ఆధారంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి వ్యాపారవేత్తలను కలిసి బంగారం ఆభరణాల పేరు చెప్పి మోసాలకు పాల్పడుతుంటారు. ఇప్పటివరకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో చాలా మంది వ్యాపారవేత్తలను ఈ గ్యాంగ్ మోసం చేసిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
పాతబస్తీ చంద్రాయణ్ గుట్ట నకిలీ బంగారం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితులను శివయ్య, తిరుపతయ్య, ఇంద్రజుగా గుర్తించామని అన్నారు. నిందితుల నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. వీరు మైసూర్లో లంకె బిందెలు దొరికాయి. కొంటారా అని మాటలు చెప్పారు. మొదట అసలు బంగారం చూపించి చెక్ చేసుకోమని చెబుతారు. తరువాత నకిలీ బంగారం ఇచ్చి మోసం చేశారు. వీళ్ళపై పాత కేసులు కుడా ఉన్నాయి.’’ అని సీపీ తెలిపారు.