యాప్నగరం

KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు

KCR National Party: జాతీయ రాజకీయాల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు గులాబీ దళపతి కేసీఆర్. అనుకున్నట్టుగానే దసరా రోజు మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు జాతీయ పార్టీని ప్రకటిస్తారని కారు పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రగతి భవన్‌లో మంత్రులు, టీఆర్ఎస్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్లతో భేటీ అయిన కేసీఆర్.. జాతీయ పార్టీపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీకి.. కొత్తగా పెట్టబోయే జాతీయ పార్టీకే పోటీ ఉంటుందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 2 Oct 2022, 6:31 pm

ప్రధానాంశాలు:

  • జాతీయ పార్టీపై నేతలకు క్లారిటీ ఇచ్చిన కేసీఆర్
  • దసరా రోజు మధ్యాహ్నం ప్రకటించనున్న కేసీఆర్
  • డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభకు ప్లాన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu KCR National Party
కేసీఆర్ జాతీయ పార్టీ
KCR National Party: అందరూ అనుకున్నట్టుగానే.. కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీకి ముహూర్తం ఖరారు అయ్యింది. విజయదశమి రోజున మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు కేసీఆర్‌ జాతీయ పార్టీ గురించి ప్రకటన చేయనున్నారు. ఆదివారం నాడు మంత్రులు, టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులతో ప్రగతి భవన్‌లో భేటీ అయిన గులాబీ దళపతి.. జాతీయ పార్టీపై నేతలకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దసరా రోజున టీఆర్ఎస్ (TRS) కార్యవర్గ భేటీలో జాతీయ పార్టీకి ఆమోదం తెలపనున్నారు.
కేసీఆర్‌తో భేటీ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో ప్రజలంతా కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలు.. కేసీఆర్‌ (CM KCR) జాతీయ పార్టీలో విలీనమయ్యేందుకు సిద్ధమయ్యాయని వ్యాఖ్యానించారు. పార్టీ ప్రకటన రోజు కూడా కొందరు నేతలు అతిథులుగా పాల్గొనబోతున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని 33 జిల్లాల అధ్యక్షులు కోరినట్టు స్పష్టం చేశారు.

జాతీయ పార్టీ ప్రకటించిన వెంటనే.. కేసీఆర్ బిజీ బిజీ కానున్నారు. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దసరా రోజు పలు రాష్ట్రాలకు చెందిన రైతు, కార్మికసంఘాలు, పార్టీల నేతల్ని కేసీఆర్ భోజనానికి ఆహ్వానించనున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. ఇకనుంచి రెగ్యులర్‌గా ఏదో ఒక రాష్ట్రం నేతలతో కేసీఆర్ భేటీ కావాలని భావిస్తున్నట్టు సమాచారం. నిత్యం వార్తల్లో నిలిచేలా.. ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

జాతీయ స్థాయిలో పలు కీలక అంశాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నారు. కేంద్రంపై దాడి చేస్తూ.. రైతు, దళిత, కార్మిక, యువత, మహిళల అంశాలపై ఉద్యమాలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇందుకోసం రాష్ట్రాల్లో సమన్వయకర్తల్ని నియమించే ఆలోచన కూడా చేస్తున్నారు. అలాగే.. దేశ వ్యాప్తంగా సభ్యత్వ నమోదుపైనా ఫోకస్ పెట్టనున్నారు. ఈనెల 6 లేదా 7న భారీ బహిరంగసభ నిర్వహించే అవకాశం ఉంది. అలాగే.. డిసెంబర్‌ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో గులాబీ దళపతి ఉన్నట్టు తెలుస్తోంది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.