యాప్నగరం

కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంట విషాదం

కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.దీంతో పలువురు నేతలు కిషన్ రెడ్డిని పరామర్శించారు.

Samayam Telugu 22 Apr 2021, 8:40 am

ప్రధానాంశాలు:

  • కిషన్ రెడ్డి పెద్దన్నయ్య యాదగిరి రెడ్డి మృతి
  • అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన యాదగిరిరెడ్డి
  • కిషన్ రెడ్డికి పలువురు నేతల పరామర్శ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కిషన్ రెడ్డి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన పెద్దన్నయ్య యాదగిరిరెడ్డి అనారోగ్యంతో బుధవారం రాత్రి తుది శ్వాసవిడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి కిషన్‌రెడ్డి తిమ్మాపూర్ చేరుకున్నారు. యాదగిరిరెడ్డి మృతి విషయం తెలిసిన పలువురు నేతలు కిషన్‌రెడ్డిని పరామర్శించారు. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.