యాప్నగరం

హైదరాబాద్ సరూర్‌ నగర్‌లో సాయంత్రం 5 నుంచి లాక్‌డౌన్

Hyderabad Lockdown: సాయంత్రం 5 నుంచి ఉదయం 5 గంటల వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నిర్వహిస్తున్నట్లు ఆ డివిజన్‌ కార్పొరేటర్‌ పేర్కొన్నారు. దీనిపై డివిజన్‌లో వ్యాపారులు, ప్రజలతో చర్చించామన్నారు.

Samayam Telugu 11 May 2021, 11:22 am
కరోనా సెకండ్‌ వేవ్‌ భీభత్సం సృష్టిస్తోంది. భారీ సంఖ్యలో ప్రజలు పాజిటివ్ బారిన పడుతున్నారు. అనేక మంది వైరస్‌తో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటికే అనేక రాష్ట్రాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తాజాగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ డివిజన్‌లో వారం రోజుల పాటు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు.
Samayam Telugu సరూర్ నగర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్


సోమవారం ప్రారంభం అయిన లాక్‌డౌన్ నిబంధనలు.. ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి ఉదయం 5 గంటల వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నిర్వహిస్తున్నట్లు ఆ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆకుల శ్రీవాణి అంజన్‌ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్నారు. ఎవరిపై ఒత్తిడి ఉండదని, డివిజన్‌లోని ప్రజలు, వ్యాపారులతో చర్చించిన తరువాత స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా అరికట్టడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

మరోవైపు ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలోతెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మహమ్మారిని కంట్రోల్ చేయాలంటే లాక్ డౌన్ పెట్టాల్సిందే అని అనేక సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అంతే కాకుండా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలో లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ పెడితే తలెత్తే పరిణామాలు, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద ప్రభావం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కేబినెట్ ఆమోదం తెలిపితే ఒకటి, రెండు రోజుల సమయం ఇచ్చి రంజాన్ తరువాత (మే15) నుంచి లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో వున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.