యాప్నగరం

పెళ్లికి ఇంట్లో ఒప్పుకోని ఫ్యామిలీ.. ప్రేమికుల జంట సంచలన నిర్ణయం.. చివరికి..

Hyderabad: ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి‌ చెందిన మైనర్ బాలిక (17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. విశాల్ (21) అనే యువకుడు స్థానికంగా ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరు గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు.

Samayam Telugu 16 May 2021, 7:54 pm
Lovers Suicide: హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెరువులో రెండు మృతదేహాలు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలయ్య నగర్ వద్ద ఉన్న క్వారీ నీటి గుంతలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
lovers suicide


ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి‌ చెందిన మైనర్ బాలిక (17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. విశాల్ (21) అనే యువకుడు స్థానికంగా ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరు గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి ప్రేమ ఇరు కుటుంబాలలో తెలిసిపోయింది. ఇరు కుటుంబాల్లోని తల్లిదండ్రులు వీరి ప్రేమని ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఈ ప్రేమికులు ఇంటి నుండి వెళ్ళిపోయారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు 14వ తేదీన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వీరిపై అదృశ్యం కేసు నమోదు చేసుకున్నారు.

తాజాగా చెరువులో రెండు శవాలు కనిపించాయి. అయితే, ఈ సంఘటన శనివారం జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం మృత దేహాలు నీటిపైన తేలడంతో స్దానికులు ఇచ్చిన సమాచారంతో స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.