యాప్నగరం

Malkajgiri ఎమ్మెల్యే మైనంపల్లికి బిగ్ షాక్.. రేప్‌కి యత్నించారని ఫిర్యాదు, కేసు

అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకి బిగ్‌షాక్ తగిలింది. తనపై దాడి చేశారని.. లోపలికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశారని మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది.

Samayam Telugu 24 Aug 2021, 9:05 pm
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకి మరో షాక్ తగిలింది. ఆయనపై ఇప్పటికే రెండు కేసులు నమోదు కాగా.. తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దుల్లాపల్లిలోని ఆయన ఇంటి వద్దకి వచ్చిన దళిత మహిళలను దూషించడమే కాకుండా.. వారిపై దాడికి యత్నించారన్న ఫిర్యాదు మేరకు ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దళిత మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని.. రేప్ చేసేందుకు యత్నించారంటూ బీజేపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో 354, SEC3(1)(s) SC/ST(POA) act 1989 కింద కేసులు నమోదయ్యాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
mynampalli


స్వాతంత్ర్య దినోత్సవం రోజు జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన అనుచరులు బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్‌పై దాడి చేసి గాయపరచడంతో కమలం పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఘాటు హెచ్చరికలు చేశారు. మైనంపల్లి లెక్కలు తీస్తామంటూ హెచ్చరించారు. అందుకు మైనంపల్లి కూడా అదే స్థాయిలో ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ రాసలీలలు బయటపెడతానంటూ బూతుపురాణం అందుకున్నారు. తీవ్ర దుర్భాషలకు దిగడంతో బీజేపీ శ్రేణులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.

తన పార్టీ అధ్యక్షుడిని బండబూతులు తిట్టినందుకు నిరసనగా ఈ నెల 17న మైనంపల్లి ఇంటి వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇంటి వద్ద నిరసన చేపట్టడంతో ఎమ్మెల్యే మైనంపల్లి, ఆయన అనుచరులు ఆగ్రహంతో ఊగిపోయారని.. దళిత మహిళలను కులం పేరుతో తిడుతూ దాడి చేసేందుకు యత్నించారని ఆరోపణలు వచ్చాయి. దళిత సంఘాలు విషయాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో కమిషన్ సీరియస్‌గా స్పందించింది. కమిషన్ వైస్ చైర్మన్ నేరుగా హైదరాబాద్ చేరుకుని బాధిత మహిళలతో చర్చించారు.

విచారణ అనంతరం 24 గంటల్లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అప్పటికే శ్రావణ్‌పై దాడి చేసిన ఘటనలో ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. తాజాగా ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. దళిత మహిళ అని కూడా చూడకుండా తనపై దాడి చేశారని.. ఎమ్మెల్యే తనను లోపలికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశారని మహిళ చేసిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు ఎఫ్‌ఐఆర్‌‌లో నమోదు చేశారు.

Also Read: రాజ్యాంగం రాసింది మా తాత.. మాజీ ఐపీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు
Read Also:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.