యాప్నగరం

దొంగతనంలో ఇదోరకం.. వనస్థలిపురంలో ఇలాంటి చోరీ ఎవరూ ఊహించరు!

Vanasthalipuram: మహిళ ఒంటిపై ఉన్న రెండున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లాడు. సమాచారం అందుకున్న వెంటనే వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Samayam Telugu 6 Feb 2021, 10:44 pm
హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ దొంగల బెడద ఎక్కువగా అయిపోయింది. దుండగులు ముందుగా రెక్కీ నిర్వహించి ఆ తర్వాత ఒంటరిగా ఉన్న మహిళలను, తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి శనివారం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Theft


శనివారం ఓ వ్యక్తి ఇంటి అద్దె కోసం వచ్చి ఉమాదేవి అనే మహిళపై దాడి చేశాడు. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని గౌతమి నగర్‌లో ఓ ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇంట్లో అద్దెకు గదులు ఉన్నాయా అంటూ ఓ వ్యక్తి శనివారం ఉదయం వచ్చి అడిగాడు. మళ్ళీ అదే వ్యక్తి మధ్యాహ్నం వచ్చి దొంగతనం చేశాడు. ఉదయం రెక్కీ చేయడానికి కిరాయి దారుడిగా వచ్చి మహిళ ఒంటరిగా ఉంటుందని ఆ వ్యక్తి గమనించాడు. మళ్లీ ఇతనే మధ్యాహ్న సమయంలో మళ్ళీ వచ్చి ఇంట్లో ఉన్న ఒంటరి మహిళపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

మహిళ ఒంటిపై ఉన్న రెండున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లాడు. సమాచారం అందుకున్న వెంటనే వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చెసుకోని దర్యాప్తు చెస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.