యాప్నగరం

HYD: భార్యను చంపి.. రైలు కింద పడ్డ భర్త.. సూసైడ్ నో‌ట్‌తో వెలుగులోకి!

భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే.. అయినా కొందరు వీటిని సీరియస్‌గా తీసుకొని జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. భార్యతో గొడవపడ్డ ఓ భర్త.. చివరకు ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది.

Authored byRaj Kumar | Samayam Telugu 28 Jun 2022, 3:00 pm
హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసిన ఓ భర్త అనంతరం రైలు కింద పడి తన ప్రాణం కూడా తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న వెంటనే రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు అయితే అక్కడ డైరీ లభించింది. అందులో అతడు తన భార్యను బాత్రూం చంపేసి బకెట్‌లో శవాన్ని ఉంచినట్లు పేర్కొన్నాడు. దీంతో ఆర్పీఎఫ్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu wife and husband


వివరాల్లోకి వెళ్తే.. అస్సాం రాష్ట్రానికి చెందిన మహానంద్ బిశ్వాస్ (24) అతడి భార్య పంపా సర్కార్ (22) జీవనోపాధి నిమిత్తం గత 20 రోజుల కింద హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలోనే జీవీకేలోని ఓ షాపులో భార్యాభర్తలు పనిచేస్తూ ఖైరతాబాద్‌లోని ప్రేమ్‌నగర్‌లో నివాసముంటున్నారు. అయితే మూడ్రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. అనంతరం ఏం జరిగిందో తెలియదు కానీ భర్త మహానంద్ భార్యను అతి కిరాతకంగా బాత్రూంలో చంపి పడేసి అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న వెంటనే పంజాగుట్ట పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. అయితే నిన్న సాయంత్రమే భార్యను అతి కిరాతకంగా హత్య చేసి బాత్రూంలో పడేసి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.