యాప్నగరం

నగర నడిబొడ్డున సంచిలో మృతదేహం.. హత్య చేసి పడేశారు

అయితే కృష్ణ ఇంటి దగ్గర పోలీసులు రక్తపు మరకల్ని గుర్తించారు. దీంతో అతడ్ని ఇంటి వద్దే హత్య చేసి మూటకట్టి చెరువు దగ్గర పడేశారా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Samayam Telugu 5 Jan 2021, 6:39 am
హైదరాబాద్ నగర నడిబొడ్డున ఓ సంచి కలకలం రేపింది. అందులో మృతదేహాన్ని చూసిన స్థానికులు హడలిపోయారు. ఈ ఘటన కట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రకాష్ నగర్‌ లో కృష్ణ అనే వ్యక్తిని‌ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసారు. మహబూబ్ నగర్ కొల్లాపూర్ పండ్లవెల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుమారుడు కృష్ణ కూకట్‌పల్లి ప్రకాష్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. మరుగుజ్జు అయిన కృష్ణ స్థానికంగా విద్యార్థులకు ట్యూషన్ లు చెప్పటమే కాకుండా, పూల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
Samayam Telugu కూకట్‌పల్లిలో హత్య


అయితే ఈ రోజు మధ్యాహ్నం కూకట్‌పల్లి నల్లచెరువులో ప్లాస్టిక్ సంచిలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందంది. దీంతో అక్కడికి చేరుకొని చూడగా స్థానికులు హత్యకు గురైనది కృష్ణ అని గుర్తించారు. ప్రకాష్ నగర్ లోని మృతుడి ఇంటికి చేరుకున్న పోలీసులకు ఇంటి ఎదుట రక్తపు మరకలు కనిపించటంతో అనుమానం మరింత బలపడింది. కృష్ణను అతడి ఇంటి వద్దనే హత్య చేసి సంచిలో మూటకట్టి చెరువులో పారవేసారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read More: పీసీసీ చీఫ్ కాదు.. నాకు ఆ పదవి సూట్ అవుతుంది: రేవంత్ రెడ్డి ఊహించని ట్విస్ట్

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. మృతుడికి ఎవరితో గొడవలు లేవని, హత్య ఎవరు ఎందుకు చేసారనేది తెలియటం లేదని మృతుని బంధువులు తెలిపారు. కృష్ణ ఇంటి వద్ద రక్తపు మరకలు ఆధారంగా కేసును ట్రేస్ చేసే పనిలో పడ్డారు. కృష్ణ ఇంటి చుట్టుపక్కల నివసిస్తున్న వారిని కూడా విచారిస్తున్నారు పోలీసులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.