యాప్నగరం

Medchal Accident: వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీకొని వ్యక్తి మృతి

Medchal Accident: బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీ కొని ఓ వ్యక్తి స్పాట్‌లోనే మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా అత్వెలి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 14 Feb 2023, 2:13 pm

ప్రధానాంశాలు:

  • మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీకొని వ్యక్తి మృతి
  • కేసు నమోదు చేసిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vanteru Pratap Reddy Car Accident
వంటేరు ప్రతాప్ రెడ్డి
Vanteru Pratap Reddy Car Accident: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీఆర్ఎస్ నేత, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలోని అత్వెల్లి వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు.. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టినట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో వంటేరు ప్రతాప్ రెడ్డి కారులోనే ఉన్నట్లు సమాచారం.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వంటేరు ప్రతాప్ రెడ్డిని అక్కడి నుంచి పంపించినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మృతుడికి సంబంధించిన విషయాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.