యాప్నగరం

Hyderabad: మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఊహించలేం.. అందుకు ఈ ఘటనే ఉదాహరణ !

Hyderabad: హైదారాబాద్ చర్లపల్లిలో ఓ వ్యక్తిని మృత్యువు ఊహించని రీతిలో కబళించింది. బైక్‌పై వెళ్తుండగా.. సిలిండర్ నాజిల్ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. ఆటోలో నుంచి సిలిండర్లు క్రిందకు దింపే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 11 Feb 2023, 10:55 am

ప్రధానాంశాలు:

  • చర్లపల్లిలో ఉహించని విధంగా వ్యక్తి మృతి
  • బైక్‌పై వెళ్తుండగా తగిలిన సిలిండర్ నాజిల్
  • మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu cherlapally cylinder accident
చర్లపల్లి ప్రమాదం
cherlapally : మృత్యువు ఏ రూపంలో కబళిస్తుందో ఊహించటం కష్టం. అప్పటి వరకు సరదగా గడిపిన వారు కూడా ఉన్నట్లుండి కూప్పకూలుతున్న ఘటనలు ఇటీవల కాలంలో మనం చాలానే చూస్తున్నాం. కారణాలు ఏవైనా ఆకాల మృత్యువులతో అనేక కుటుంబాల్లో విషాదం అలుముకుంటుంది. ఇలాంటి ఘటనే హైదరాబాద్ కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని సిలిండర్ నాజిల్ రూపంలో మృత్యువు కబళించింది.
వివరాల్లోకి వెళితే.. ఏపీలోని కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన ప్రకాశ్‌(48) 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. చర్లపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటూ అక్కడే సౌత్‌వైర్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. చర్లపల్లి పారిశ్రామికవాడ బీఎన్‌రెడ్డినగర్‌లో సూర్య ఇంజినీరింగ్‌ పరిశ్రమకు మంగళవారం సాయంత్రం ఆక్సిజన్‌ సిలిండర్లలో లోడుతో ఆటో వచ్చింది. కూలీలు ఆటోలోని సిలండర్లను కిందకు దింపుతుండగా.. ఓ సిలిండర్ కిందపడింది. ఈ క్రమంలో దానికున్న నాజిల్‌ ఊడి ప్రెషర్‌తో గాల్లోకి దూసుకెళ్లింది. అటుగా ద్విచక్ర వాహనంపై వెళ్లే ప్రకాశ్‌ తలకు నాజిల్ తగలటంతో ఆయన ఒక్కసారిగా కిందపడిపోయాడు. అనంతరం క్షణాల వ్యవధిలోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడికి భార్య జ్యోతి, కవల పిల్లలు కార్తీక్‌, కీర్తన్‌ ఉన్నారు. ప్రకాశ్ అకాల మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బీఎస్సీ, బీఫార్మసీ చదువుతున్న ఇద్దరు కుమారులు ప్రకాశ్ మృతదేహాన్ని చూసి రోదించిన తీరు పలువురిచే కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాగా.. ప్రకాశ్ హెల్మెట్ ధరించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.