యాప్నగరం

కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. త్రిబుల్ రైడింగ్‌లో ఒకరు మృతి

Cable Bridge: యూసఫ్ గూడ నుండి గచ్చి బౌలి వైపు ముగ్గురు వ్యక్తులు బైక్ వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ బైక్‌పై అతివేగంగా వచ్చిన యువకులు.. డివైడర్‌ను ఢీ కొట్టి పడిపోయారు.

Samayam Telugu 17 Dec 2020, 10:41 pm
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే చనిపోయాడు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు శివ (20), గాయపడిన వ్యక్తులు ప్రశాంత్, విజయ్ (23) గా పోలీసులు గుర్తించారు. గాయాలైన వ్యక్తిని స్థానిక హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించారు.
Samayam Telugu ప్రమాదానికి గురైన బైక్
cable bridge


యూసఫ్ గూడ నుండి గచ్చి బౌలి వైపు ముగ్గురు వ్యక్తులు బైక్ వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ బైక్‌పై అతివేగంగా వచ్చిన యువకులు.. డివైడర్‌ను ఢీ కొట్టి పడిపోయారు. ఈ ఘటనలో శివ అనే యువకుడు స్పాట్‌లో మృతి చెందాడు. మరో ఇద్దరు ప్రశాంత్, విజయ్ గాయపడగా ఆస్పత్రికి తరలించారు. సూరారంలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మృతుడు శివ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతని నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.