యాప్నగరం

శంషాబాద్‌లో మిస్టరీ డెత్.. హత్యా? ఆత్మహత్యా?

శంషాబాద్ పరిధిలోని క్వారీ వద్ద రామ్‌ రెడ్డి అనే వ్యక్తి ఉరికి వేలాడుతూ కనిపించాడు. అయితే అతన్ని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో మిస్టరీగా మారింది.

Samayam Telugu 27 Jan 2021, 7:52 pm

ప్రధానాంశాలు:

  • వ్యక్తి అనుమానాస్పద మరణం
  • ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించిన మృతదేహం
  • హత్య చేసి వేలాడదీశారని ఆరోపణలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death
శంషాబాద్‌లో వ్యక్తి అనుమానాస్పద మరణం కలకలం రేపింది. మున్సిపాలిటీ పరిధిలో రామ్‌రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శవమయ్యాడు. కొత్వాల్‌గూడ క్వారీ వద్ద ఓ గదిలో ఫ్యాన్‌కి రామ్ రెడ్డి వేలాడుతూ కనిపించాడు. రామ్‌ రెడ్డి ఉరికి వేలాడుతుండడం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న రామ్ రెడ్డి కుటుంబ సభ్యులు తరలివచ్చారు. రామ్ రెడ్డి ఆత్మహత్య చేసుకోలేదని.. ఎవరో కావాలనే హత్య చేసి ఫ్యాన్‌కి వేలాడదీశారని అనుమానం వ్యక్తం చేశారు. అది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.