యాప్నగరం

15th August: ప్రసంగిస్తూ కుప్పకూలి మృతి.. కాప్రాలో విషాదం

Kapra Man Death giving Independence Day Speech: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్‌లోని కాప్రా పరిధిలోని వంపుగూడ లక్ష్మీ విల్లాస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక నివాసి, వ్యాపారి ఉప్పల సురేష్.. జెండా వందనం తర్వాత సభలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. గుండె పోటుకు గురై మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ముందే ఈ విషాదం చోటు చేసుకుంది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 16 Aug 2022, 7:26 pm
హైదరాబాద్ నగరంలోని కాప్రాలో (Kapra) స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. జెండా వందనం కార్యక్రమం తర్వాత జరిగిన సభలో ప్రసంగిస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు ఓ వ్యాపారి. కాప్రా పరిధిలోని వంపుగూడ ‘లక్ష్మి విల్లాస్’లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఘటన జరిగినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని విల్లాస్‌లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెండా వందనం అనంతరం వ్యాపారి ఉప్పల సురేష్ (56) ప్రసంగించారు. స్వాతంత్య్రోద్యమానికి సంబంధించిన ఘట్టాల గురించి ప్రస్తావిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. అక్కడే ఉన్న సురేష్ తండ్రి యాదగిరి, భార్య కరుణ, కూతురు మైత్రి, కుమారుడు ధర్మపాల్.. నిశ్చేష్టులయ్యారు.
Samayam Telugu Man dies while giving Independence day speech in Kapra
ప్రసంగిస్తూ కుప్పకూలిన ఉప్పల సురేష్


వెంటనే స్థానికులు సురేష్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండె పోటు కారణంగా సురేష్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో కాప్రాలోని వంపుగూడలో విషాద వాతావరణం నెలకొంది..

ఉప్పల సురేష్.. బాగ్ అంబర్ పేట పరిధిలోని డి.డి. కాలనీలో ఫార్మాస్యూటికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. ఆయన మరణవార్త విని పలువురు విస్మయం చెందారు. తన కళ్ల ముందే కొడుకు మృతి చెందటం బాధాకరం అంటూ తండ్రి యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పల సురేష్ మృతి పట్ల రచయిత, సీనియర్ కళాకారుడు మల్లం రమేష్ సంతాపం వ్యక్తం చేశారు.

Also Read:

పటాన్‌చెరు: జెండా ఎగరేస్తుండగా కరెంట్ షాక్.. ఇద్దరి మృతి

భర్త కోసం అందమైన యువతిని తీసుకొచ్చిన భార్య.. ఎంత త్యాగం!

భారతీయుడిగా నా జన్మ ధన్యమైంది.. దటీజ్ ధోనీ, చిన్న డీపీతో తనేంటో చెప్పాడు
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.