రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త రెండేళ్ల కొడుకుని గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అంతే కాకుండా ఆ తర్వాత భార్యను కూడా కత్తితో పొడిచి ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. వెంటనే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. భర్త చేసిన దాడిలో తీవ్ర గాయాలైన భార్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. రెండేళ్ల బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రెండేళ్ల చిన్నారి గొంతుకోసి.. భార్యను కత్తితో పొడిచి దారుణ
కన్న కొడుకును అతి దారుణంగా హత్య చేశాడు. రెండేళ్ల పసివాడు కూడా అని చూడుకుండా గొంతుకోశాడు. అనంతరం భార్యను కూడా కత్తితో తీవ్రంగా పొడిచాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
Samayam Telugu 13 Jul 2021, 11:29 am
ప్రధానాంశాలు:
- రెండేళ్ల చిన్నారి గొంతుకోసిన తండ్రి
- భార్యను కత్తితో పొడిచి పరార్
- నిందతుడి కోసం గాలిస్తున్న పోలీసులు