యాప్నగరం

అనుమానంతో .. అత్త,భార్య దారుణ హత్య

ఇంట్లో ఉన్న భార్యతో పాటు అత్తపై త్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరీశీలించారు.

Samayam Telugu 11 Apr 2021, 10:48 am
హైదరాబాద్ ఐడిఏ బొల్లారంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆవేశంతో భార్యను, అత్తను హతమార్చిన సంఘటన బొల్లారంలో చోటుచేసుకుంది. స్వరూప, నరసింహ దంపతులు.. అయితే నరసింహకు, భార్యా స్వరూపపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఈ రోజు తెల్లవారుజామున భార్యను అత్తను కత్తితో దాడి చేసి అతి దారుణంగా హత్య చేశాడు. ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.
Samayam Telugu అత్త, భార్య దారుణ హత్య


సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి .చేరుకున్నారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే భార్యపై అనుమానమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అత్త కూడా భార్యను కాపురానికి పంపడం లేదని ఆమెను హతమార్చినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.