యాప్నగరం

కట్టుకున్న భార్యపై ఘాతుకం.. అడ్డొచ్చిన అత్తనీ వదలని అల్లుడు

కట్టుకున్న భార్యని కిరాతకంగా హతమార్చడో కసాయి భర్త. అడ్డొచ్చిన అత్తనీ వదలకుండా దారుణానికి తెగబడ్డాడు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Samayam Telugu 16 Sep 2021, 5:31 pm
హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. తల్లీకూతుళ్లను అమానుషంగా నరికి చంపాడో కిరాతకుడు. భార్యపై కత్తితో డాడి చేస్తుండగా అడ్డొచ్చిన అత్తని కూడా నరికేశాడు. ఈ దారుణ ఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆర్మీ ఆస్పత్రిలో పనిచేస్తున్న నాగ పుష్పకి అదే ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న చినబాబుతో వివాహమైంది. ఇటీవల భార్యాభర్తల నడుమ వివాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


మరోమారు భార్యతో గొడవ జరగడంతో ఆగ్రహం చెందిన చినబాబు భార్య నాగపుష్పపై కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన అత్తని కూడా దారుణంగా నరికి చంపాడు. తీవ్రగాయాలపాలైన తల్లీకూతుళ్లు రక్తపు మడుగులో కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయారు. గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్యలు జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.