యాప్నగరం

జైలు నుంచి వచ్చి ఖతమైపోయాడు.. జగద్గిరిగుట్టలో దారుణం

నగరంలో నడిరోడ్డుపై దారుణ హత్య కలకలం రేపింది. జైలు నుంచి బయటికొచ్చిన కొద్దిరోజులకే వ్యక్తి హత్యకు గురయ్యాడు. హతుడు పాత నేరస్తుడిగా తెలుస్తోంది. పాతకక్షలే హత్యకు కారణంగా భావిస్తున్నారు.

Samayam Telugu 25 Nov 2021, 10:06 pm
ఓ హత్య కేసులో జైలుకి వెళ్లి బెయిల్‌పై బయటికొచ్చిన నిందితుడు దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హతమార్చారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా మారణాయుధాలతో దాడి చేసిన ఆగంతకులు హతమార్చి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. హతుడిని పాతనేరస్తుడు శ్రీహరి(30)గా గుర్తించారు. గతంలో జావేద్ అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీహరి ఇటీవలే బెయిల్‌పై విడుదలైనట్లు తెలుస్తోంది. బయటికొచ్చిన కొద్దిరోజులకే హత్యకు గురికావడంతో ప్రత్యర్థులే హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.