యాప్నగరం

దారుణం.. బర్త్‌డే పేరుతో 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కుటుంబ సభ్యులే బాల్య వివాహం చేశారు. వయసులో ఆమె కంటే మూడింతలు పెద్ద వ్యక్తితో పెళ్లి జరిపించాారు.

Authored byRaj Kumar | Samayam Telugu 16 May 2022, 3:50 pm
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో దారుణం జరిగింది. ఓ 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో తల్లిదండ్రులు పెళ్లి జరిపించారు. పుట్టిన రోజు వేడుకల పేరుతో బాలికకు పెళ్లి చేశారు. దీంతో బాలిక.. పెళ్లి విషయాన్ని ఐసీడీఎస్‌ సిబ్బంది, గ్రామస్తులకు తెలిపింది. దీంతో వారు పోలీసులకు సమాచారం చెరవేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


సంచార జాతులకు చెందిన ఓ 12 ఏళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి తన కంటే వయసులో మూడింతలు పెద్దవాడైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు కుటుంబీకులు.. ఈ విషయం గుర్తించిన బాలిక తనకు పెళ్లి చేశారని కలత చెందింది. ఈ క్రమంలోనే పెళ్లి ఇష్టం లేదని బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో బాలిక ఉన్న చోటుకు వచ్చి బంధువులతో తల్లిదండ్రులు గొడవకు దిగారు. ఈ క్రమంలోనే ఆ బాలిక బంధువుల ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో స్థానికుల సాయంతో ఐసీడీఎస్‌ సిబ్బంది ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.