యాప్నగరం

ఒకే గదిలో వివాహిత, ఆటోడ్రైవర్ ఆత్మహత్య.. ఎన్నో అనుమానాలు

హైదరాబాద్ నగరంలోని కాచిగూడలో ఓ వివాహిత, ఆటోడ్రైవర్ ఒకే గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Samayam Telugu 13 Jan 2021, 8:15 am
హైదరాబాద్‌లోని కాచిగూడ ప్రాంతంలో వివాహిత, ఆమె ప్రియుడు ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నిర్మల్‌ జిల్లా తానూరు మండలం తొండాల వాసి హన్మంతు(23) ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. ఆటో నడుపుకుంటూ కాచిగూడ చప్పల్‌బజార్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. పక్క వీధిలో కర్ణాటక బీదర్‌కు చెందిన దిగంబర్‌, భార్య భాగ్యశ్రీ (23), ఏడాదిన్నర కుమారుడితో కలిసి ఉంటున్నాడు.
Samayam Telugu Image


Also Read: మేడ్చల్‌‌లో రెచ్చిపోయిన దొంగలు.. ఒక్కరాత్రిలో 6 ఇళ్లలో చోరీ

సోమవారం సాయంత్రం బయటకు వెళ్లిన భాగ్యశ్రీ తిరిగి రాలేదు. దీంతో దిగంబర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడం కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు మంగళవారం సాయంత్రం హన్మంతుకు సోదరుడు అంకుశ్‌ ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో స్నేహితుడిని ఇంటికి పంపాడు. అతడి గదికి వెళ్లి చూడగా హన్మంతు సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. భాగ్యశ్రీ మంచంపై చనిపోయి ఉంది.

Also Read: వరంగల్: భర్తను బ్యాంకులోనే చితకబాదిన మహిళ.. కారణం తెలిస్తే షాకవుతారు!

సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భాగ్యశ్రీ, హన్మంతు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరు సడెన్‌గా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారన్నది సస్పెన్స్‌గా మారింది. వీరిది ఆత్మహత్యేనా? లేక ఎవరైనా హత్య చేసి సూసైడ్‌గా క్రియేట్ చేశారా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.