యాప్నగరం

హైదరాబాద్: వివాహితకు బిల్డర్ వేధింపులు.. భర్త లేని సమయంలో షాకింగ్ నిర్ణయం

తన చావుకు బిల్డర్ సందీప్, అనీలా ఆంటీ వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాసిన అలేఖ్య భర్త బయటికి వెళ్లిన సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 25 Jan 2021, 2:14 pm
ఓ బిల్డర్ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లాకు చెందిన నాగరాజు, అలేఖ్య(32)కు 11ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఉపాధి కోసం కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి పేట్‌బషీరాబాద్‌లోని పద్మానగర్ ఫేజ్-2లో నివాసముంటున్నారు. శనివారం నాగరాజు తన స్నేహితుడితో కలిసి మియాపూర్ వెళ్లాడు. కాసేపటికే పెద్దకుమార్తె అతడికి ఫోన్ చేసి అమ్మ ఉరేసుకుందని చెప్పింది.
Samayam Telugu Image


Also Read: నల్గొండ: ఏడాదిగా పెళ్లి వాయిదా వేస్తున్న ప్రియుడు... దిమ్మతిరిగే షాకిచ్చిన యువతి

దీంతో కంగారుపడిన నాగరాజు వెంటనే అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే తన స్నేహితుడు కార్తీక్‌కు ఫోన్ చేయగా అతడు ఇంటికి వెళ్లి ఉరికి వేలాడుతున్న అలేఖ్యను కిందికి దించి చూడగా అప్పటికే మరణించింది. గదిలో దొరికిన సూసైడ్ నోట్‌లో ‘నా చావుకు బిల్డర్ సందీప్, అనీలా ఆంటీయే కారణం’ అని రాసి ఉంది. దీంతో పాటు రూ.2లక్షలివ్వకుండా సందీప్‌తో తనకు అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేస్తానంటూ అనీలా వేధించిందని పేర్కొంది.

Also Read: ప్రాణం తీసిన మతాంతర ప్రేమ.. నల్గొండ జిల్లాలో ఫోటోగ్రాఫర్ దారుణహత్య, వాళ్లపైనే అనుమానాలు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అలేఖ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్త నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలేఖ్యకు బజాజ్ ఫైనాన్స్ నుంచి రూ.10లక్షల రుణం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి పలు విడతలుగా నగదు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజానిజాలు వెలుగులోకి తెస్తామని పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.