యాప్నగరం

Tagore Scene రిపీట్... గర్భిణి మృతదేహానికి చికిత్స చేసిన వైద్యులు.. , రూ.8లక్షలకు బేరం

రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఠాగూర్ సినిమా తరహా సీన్ రిపీట్ అయింది. చనిపోయిన గర్భిణి బ్రతికుందని నమ్మించి ఆమెకు వైద్యం చేస్తున్నట్లు నాటకమాడారు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 8 Sep 2022, 10:43 am

ప్రధానాంశాలు:

  • ఆమనగల్లులో ప్రైవేటు దవాఖానా వైద్యుల నిర్వాకం
  • చనిపోయిన గర్భిణికి చికత్స చేస్తున్నట్లు నాటకం
  • హైదరాబాద్‌లోని ఆసుపత్రికి పంపి నమ్మించిన వైనం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image
మీకు చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమా గుర్తుందా.. అందులో చనిపోయిన వ్యక్తి బ్రతికున్నట్లు నాటకమాడి ఓ కార్పోరేట్ ఆస్పత్రి రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తుంది. తీరా ఫీజు చెల్లించాక ఆయన చనిపోయాడని తీరిగ్గా చెబుతారు.. సరిగ్గా అలాంటి సీనే తెలంగాణలో జరిగింది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు చేసిన సర్జరీ వికటించి గర్భిణి మృతిచెందింది. ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పని ఆస్పత్రి యాజమాన్యం ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పి మెరుగైన వైద్యం కోసం మృతదేహాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయిందని కుటుంబ సభ్యుల్ని నమ్మించారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో ఆదివారం రాత్రి జరగ్గా బుధవారం వెలుగులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ ప్రసవం కోసం ఆమనగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆదివారం సాయంత్రం వైద్యులు ఆమెకు సిజేరియన్‌ చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. ఈ విషయం చెప్పకుండా మెరుగైన చికిత్స అందించాలని అదే రోజు రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యం అందుతోందని.. క్రమంగా కోలుకుంటోందని డాక్టర్లు చెప్పారు. కొద్దిసేపటి చికిత్స విఫలమైన ఆమె చనిపోయిందని చెప్పారు.

దీంతో అనుమానం వచ్చి మృతురాలి కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో ఆమనగల్లు ఆస్పత్రి యాజమాన్యం ఆడిన నాటకం బయటపడింది. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు పోలీస్ కేసు పెడతామని హెచ్చరించడంతో ఆస్పత్రి యాజమాన్య కాళ్ల బేరానికి వచ్చింది. తాము చేసిన తప్పునకు పరిహారంగా రూ.8లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి ఒప్పంద పత్ర రాసిచ్చారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Read Latest Telangana News and Telugu News
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.