యాప్నగరం

KTR: ‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌’ మాటలకే పరిమితం: మంత్రి కేటీఆర్

KTR: కేంద్ర ప్రభుత్వ విధానాలపై మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. కేంద్రానిది సహకార సమాఖ్య కాదు బలవంతపు సమాఖ్య అని వ్యాఖ్యానించారు. దక్షిణ్‌ డైలాగ్స్‌ అనే సంస్థ.. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన సౌత్‌ ఫస్ట్‌ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారతదేశం సమాఖ్య స్ఫూర్తిని కోల్పోయిందా? అనే అంశంపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 18 Sep 2022, 12:16 am

ప్రధానాంశాలు:

  • కేంద్ర ప్రభుత్వ విధానాలపై మంత్రి కేటీఆర్ ఫైర్
  • సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ మాటలకే పరిమితమని వ్యాఖ్య
  • కేంద్రానిది బలవంతపు సమాఖ్య అని కేటీఆర్ కామెంట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu KTR speaking at South First conference
సౌత్‌ ఫస్ట్‌ సదస్సులో మాట్లాడుతున్న కేటీఆర్
KTR: రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీ ఉండాలి కానీ.. కేంద్రం పెత్తనం కాదని.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అంటున్న టీమీండియా స్ఫూర్తి ఏమైందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ (PM Modi) టీమిండియా గురించి మాట్లాడతారు.. మరి కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అన్ని రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేసింది? ఎన్నిసార్లు అన్ని రాష్ట్రాలు కూర్చొని చర్చించుకున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రానిది సహకార సమాఖ్య కాదు.. బలవంతపు సమాఖ్య అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
దక్షిణ్‌ డైలాగ్స్‌ అనే సంస్థ.. హైదరాబాద్ (Hyderabad) నగరంలో నిర్వహించిన సౌత్‌ ఫస్ట్‌ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారతదేశం సమాఖ్య స్ఫూర్తిని కోల్పోయిందా? అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ఆరోగ్య రంగంలో తమిళనాడు (Tamil Nadu) బాగా పనిచేస్తోందని.. దాని గురించి ఇతర రాష్ట్రాలు కూడా తెలుసుకోవాలి కదా అని అన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మంచి పనులు జరుగుతున్నాయని.. వాటి గురించి ఇతర రాష్ట్రాలు ఎందుకు నేర్చుకోకూడదన్నారు.

అన్ని రాష్ట్రాలను కలిపి కేంద్రం సమావేశం ఏర్పాటు చేసిన సందర్భం ఎక్కడా కనిపించలేదని మంత్రి కేటీఆర్ (Minister KTR) వ్యాఖ్యానించారు. కేంద్రం సహకార సమాఖ్య గురించి మాట్లాడుతుంటుందని.. ఇలాంటివి వినడానికి బాగుంటాయి కానీ.. నిజంగా అది జరుగుతోందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను చూస్తుంటే ఇది బలవంతపు సమాఖ్య అని అనిపిస్తోందన్నారు. దేశంలో నిజంగా సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ (Sabka Saath Sabka Vikas) జరుగుతోందా? అని నిలదీశారు. ఈ సదస్సుకు కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కూడా హాజరయ్యారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.