యాప్నగరం

తప్పుడు ప్రకటనకు చింతిస్తున్నా.. కేటీఆర్

సైదాబాద్ చిన్నారి హత్య కేసు నిందితుడిని అరెస్టు చేశారంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ గందరగోళానికి దారితీసింది. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నానని మంత్రి తెలిపారు.

Samayam Telugu 14 Sep 2021, 10:13 pm
సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల బాలిక హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అభంశుభం తెలియని చిన్నారిని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని ఉరి తీయాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రోజులు గడుస్తున్నా నేటికీ నిందితుడి ఆచూకీ తెలియకపోవడం ఆందోళన రేపుతోంది. ఈ ఘటన బాధాకరమన్న మంత్రి కేటీఆర్.. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారంటూ రెండు రోజుల కిందట చేసిన ట్వీట్ విమర్శలకు దారితీసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ktr


పోలీసులు నిందితుడు దొరకలేదని చెబుతుంటే.. మంత్రి అరెస్టు చేశారంటూ ట్వీట్ చేయడం గందరగోళానికి గురిచేసింది. నిందితుడి కోసం హైదరాబాద్ పోలీసులు పది ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. చిన్నారిని చిదిమేసిన రాక్షసుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల రూపాయల బహుమతి కూడా ప్రకటించారు. ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

అయితే నిందితుడు దొరక్కుండానే అరెస్టు చేసినట్లు ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ తన తప్పును సరిదిద్దుకున్నారు. తనకు నిందితుడిని అరెస్టు చేసినట్లు పొరపాటు సమాచారం వచ్చిందని.. తన పాత ట్వీట్‌ను సరిచేసుకుంటున్నానని ఆయన అన్నారు. తప్పుడు ప్రకటనకు చింతిస్తున్నానన్న కేటీఆర్ నిందితుడిని పట్టుకోవడంలో అందరూ సహకరించాలని కోరారు. హైదరాబాద్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని.. ఆచూకీ తెలిస్తే సమాచారం అందించి నిందితుడికి కఠిన శిక్ష పడేందుకు సహకరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.