యాప్నగరం

Talasani Srinivas Yadav: తెలంగాణలో మరో 20 సంవత్సరాలు అధికారం టీఆర్ఎస్‌దే..

Talasani Srinivas Yadav: తెలంగాణ భవన్‌లో హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. హైదరాబాద్ టీఆర్ఎస్ అడ్డా అని.. ఎవరి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే.. తెలంగాణలో మరో 20 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. తెరాస కార్యకర్త అంటేనే గౌరవమైన పదవి.. అంతకంటే గౌరవమైన పదవి ఉండదని తలసాని వివరించారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 27 Nov 2022, 6:28 pm

ప్రధానాంశాలు:

  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని జోస్యం
  • బీజేపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని వ్యాఖ్య

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu talasani
Talasani Srinivas Yadav: తెలంగాణలో మరో 20 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. తెలంగాణ భవన్‌లో హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న మంత్రి తలసాని.. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఉద్ఘాటించారు. పార్టీ నాయకుల, కార్యకర్తల గౌరవం పెంచింది టీఆర్ఎస్ మాత్రమేనని.. పార్టీలో కష్టపడి పనిచేసే వారందరికీ సముచిత స్థానం లభిస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా ప్రకటించడంతో బీజేపీలో భయాందోళన మొదలైందన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలతో బీజేపీ జరిపించే దాడులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తెరాస కార్యకర్త అంటేనే గౌరవమైన పదవి.. అంతకంటే గౌరవమైన పదవి ఉండదని తలసాని వివరించారు.

"8 ఏళ్లలో నామినేట్ పోస్టులు రాలేదని కొంతమంది అసంతృప్తులు ఉండడం సహజం. పదవి రాలేదనే ఆవేదన ఉంటుంది. అవకాశం వచ్చే వరకు వేచి చూడాలి. సందర్భాన్ని బట్టి అవకాశం మన ఇంటికి వస్తుంది. అధైర్యపడొద్దు. 8 ఏళ్లలో అనేక కార్యక్రమాలు చేశాం. సంక్షేమ పథకాలు చేపట్టాం. గుజరాత్‌లో బీజేపీ బ్రహ్మడంగా పనులు చేస్తే నరేంద్ర మోదీ వంద సార్లు ఎందుకు తిరుగుతున్నారు. మొన్నటివరకు మునుగోడులో గద్దల్లా తిరిగారు.. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా.. ఒక్క తెరాస కార్యకర్తలు మాత్రమే తిరుగుతున్నారు. ఎవరి తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ బయపడదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు ఆత్మీయ సమావేశం. ఆ సమావేశాల్లో ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి. 2, 3 రోజుల్లో ఆత్మీయ సమ్మేళనాల తేదీలు ప్రకటిస్తాం. సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తాం." అని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

మంత్రి మల్లారెడ్డి పట్ల ఐటీ అధికారులు అనైతికంగా ప్రవర్తించారని మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం అందరికి వస్తుందన్నారు. రేపు మీ పరిస్థితి వచ్చినప్పుడు అలాగే జరుగుతుందన్నారు. కుస్తీ పోటీలు పెట్టినట్లు నడుచుకుంటే అందుకు కూడా తాము రెడీ అని సవాల్ విసిరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
  • Read More Telangana News and Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.