యాప్నగరం

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈరోజు, రేపు ఎంఎంటీఎస్‌లు రద్దు..

హైదరాబాద్ వాసులకు ఎంఎంటీఎస్‌ రైళ్ల నుంచి అలర్ట్ వచ్చింది. జంట నగరాల పరిధిలో ట్రాక్‌ మెయింటెనెన్స్‌, ఆపరేషనల్‌ పనుల నేపథ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో పలు మార్గాల్లో ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో రాకేష్‌ స్పష్టం చేశారు. మొత్తంగా 19 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని నగరవాసులు తమ ప్రయాణాలు సాగించాలని కోరారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 13 Jan 2023, 9:49 am

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్ వాసులకు ఎంఎంటీఎస్ అలర్ట్
  • ఈ నెల 13, 14 తేదీల్లో పలు మార్గాల్లో ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు
  • మొత్తంగా 19 సర్వీసులను రద్దు చేసినట్లు స్పష్టం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu mmts-train
ఎంఎంటీఎస్
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్. నగరంలో ఈరోజు, రేపు ఎంఎంటీఎస్‌ల సర్వీసులు రద్దయ్యాయి. జంట నగరాల పరిధిలో ట్రాక్‌ మెయింటెనెన్స్‌, ఆపరేషనల్‌ పనుల నేపథ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో పలు మార్గాల్లో ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో రాకేష్‌ స్పష్టం చేశారు. లింగంపల్లి-నాంపల్లి రూట్‌లో 2, నాంపల్లి-లింగంపల్లి మార్గంలో 3, ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 5 సర్వీసులను రద్దు చేసినట్లు రాకేష్ తెలిపారు. వీటితో పాటు లింగంపల్లి- ఫలక్‌నుమా మార్గంలో 6 సర్వీసులు, రాంచంద్రాపురం-ఫలక్‌నుమాలో 1, ఫలక్‌నుమా- రాంచంద్రాపురం రూట్‌లో 1, ఫలక్‌నుమా- నాంపల్లి మార్గంలో 1 సర్వీసులు రద్దు చేశారు. ఇలా మొత్తంగా 19 సర్వీసులను రద్దు చేసినట్లు సీపీఆర్వో రాకేష్ పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని నగరవాసులు తమ ప్రయాణాలు సాగించాలని కోరారు.
మరోవైపు.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో 21 టిక్కెట్‌ కౌంటర్లను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. సాధారణ రోజుల్లో 12 మాత్రమే ఉండగా.. పండగ రద్దీ దృష్యా అదనపు సిబ్బందిని నియమించినట్టు అధికారులు తెలిపారు. రైళ్లు ఏ సమయానికి, ఏ ప్లాట్‌ఫామ్‌కు వస్తాయనేది ఎప్పటికప్పుడు ప్రకటించడమే కాకుండా.. సహాయకులను అదనంగా సమకూర్చినట్టు పేర్కొన్నారు. టిక్కెట్‌ తనిఖీ సిబ్బందిని 20 నుంచి 40కి పెంచామన్నారు. వీళ్లతో పాటు 60 మంది ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, 30 మంది జీఆర్పీ నిత్యం విధుల్లో ఉండేలా చూస్తున్నట్టు తెలిపారు.

'RRR సినిమా వేస్తే థియేటర్లు కాల్చేస్తామని వార్నింగ్లు.. అవార్డు రాగానే అభినందనలా..?'
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.